తెలుగు దేశం పార్టీకి చెందిన మంత్రులు, పార్టీ శ్రేణులకు తాను రాజధాని ప్రాంత రైతులు భూ సమీకరణ విషయమై స్పందిస్తున్న క్రమంలో వారు అనేక విమర్శలు చేశారని జనసేన అధినేన పవన్ స్టార్ పవన్ కల్యాన్ అన్నారు. టీడీపీతో తెగదెంపులు చేసుకునేందుకు తనకు ఎంత సేపు పడుతుందని ఆయన ప్రశ్నించారు. వీధి పోరాటాలు చేయడానికి మనం పార్టీలు పెట్టుకోనవసరం లేదని, ప్రజాస్వామ్య వ్యవస్థలు అవసరం లేదని... కానీ మాటలు ద్వారా, చర్చల ద్వారా సమస్యలను పరిష్కరించుకోవచ్చునని, ఆ ఉద్దేశంతోనే వచ్చానని, టీడీపీతోగానీ, సీఎం చంద్రబాబు నాయుడుతో గొడవ పెట్టుకోడానికి రాలేదని పవన్ అన్నారు. గొడవలు పెట్టుకోవడం వల్ల సమస్యలు పరిష్కారం అవుతాయంటే నేను దానికి కూడా సిద్ధమేనని ఆయన అన్నారు. సమస్యను సామరస్యపూర్వకంగా పరిష్కరించాలని ఆయన ప్రభుత్వానికి సూచించారు.
నవ్యాంధ్రగా ఏర్పడిన రాష్ట్రానికి అనుభవం వున్న నాయకులు కావాలని, తొమ్మిదేళ్ల పాలనానుభం వున్నచంద్రబాబు నాయుడుకు తాను మద్దతిచ్చినట్లు పవన్ చెప్పారు. అయితే తనకు వ్యక్తిగతంగా ఎవరూ శత్రువులు లేరని వైసీపీని ఉద్దేశించి పవన్ వ్యాఖ్యలు చేశారు. తనకు ఏ పార్టీ ఎక్కువ, తక్కువకాదని అన్నారు. తాను అభివృద్ధికి ఆటంకం కలిగించేవాడనని టీడీపీలో కొందరు మంత్రులు చేసిన వ్యాఖ్యలు తనకు కోపాన్ని తెప్పించాయన్నారు. తాను ఎవరి పక్షానో మాట్లాడుతున్నానని విమర్శలు తగవన్నారు. తనది ప్రజల పక్షమని చెప్పుకోచ్చారు. అలా అనుకుంటే తాను టీడీపీకి ఎందుకు మద్దతు ఇస్తానని పవన్ ప్రశ్నించారు
నవ్యాంధ్రలో అధికారంలో వున్న తెలుగుదేశం ప్రభుత్వానికి తాను మిత్రపక్షవాదినని చెప్పుకోచ్చిన పవన్.. అంతమాత్రాన ప్రభుత్వం చేసే ప్రతీ కార్యక్రమాన్ని వెనుకేసుకురాలేమని చెప్పారు. ప్రభుత్వం చేపట్టే కార్యక్రమాలు అన్ని మంచిగా వుంటాయని చెప్పలేమని, కొన్ని కార్యక్రమాలు ప్రజలకు ఇబ్బందులు కలిగించవచ్చని.. అలాంటిదే రాజధాని భూసేకరణ కార్యక్రమం అన్నారు. దీనిని తాను తన పార్టీ పరంగా ఖండిస్తున్నానని, రైతుల భూములను బలవంతంగా లాక్కోవద్దని తాను అనేక పర్యాయాలు సూచించానని చెప్పుకోచ్చారు. మిత్రపక్షం అయినంత మాత్రాన అధికారపక్షానికి తాను బానిసను కాదని తేల్చిచెప్పారు. ప్రజల నుంచి సేకరించకుండానే గొప్ప రాజధాని కట్టుకునేంత భూమి రాష్ట్రంలో అందులోనూ కృష్ణా, గుంటూరు జిల్లాల్లోనే వుందని పవన కల్యాన్ అన్నారు
జి మనోహర్
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more