రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర కలకలం రేపిన రిషితేశ్వరి కేసులో మరో కీలక మలుపు చోటు చేసుకుంది. ఆత్మహత్యకు ముందు ఆమె రాసుకున్న మరో డైరీ బయటపడింది. వరంగల్లోని తమ ఇంట్లో రెండో డైరీని గుర్తించిన రిషితేశ్వరి తల్లిదండ్రులు మురళీకృష్ణ, దుర్గాబాయి... దానిని గుంటూరులోని పోలీసు ఉన్నతాధికారులకు అందజేశారు. ఈ రెండో డైరీలో 13 పేజీల్లో రిషితేశ్వరి తాను యూనివర్సిటీలో చేరినప్పటి నుంచి పడిన నరకయాతన గురించి, తనను సీనియర్లు వేధించిన తీరును, తాను అనుభవించిన ఆవేదనను ఎంతో బాధగా రాసుకుంది. ఇప్పటికే రాషితేశ్వరి రాసిన ఒక డైరీ వెలుగులోకి వచ్చిన సంగతి తెలిసిందే. దాని ఆధారంగా పోలీసులు కేసు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఇప్పుడు వెలుగులోకి వచ్చిన రెండో డైరీతో ఈ కేసు మలుపు తిరిగింది. ఈ కేసులో సీనియర్ విద్యార్థులైన హనీషా, జయచరణ్, శ్రీనివాస్ అరెస్టయిన విషయం విదితమే!
నిజానికి రిషితేశ్వరి రాసుకున్న మొదటి డైరీలో తనను వేధింపులకు గురిచేసిన సీనియర్ల పేరు రాసినప్పటికీ అవి కొట్టివేసి ఉన్నాయి. దాంతో అవి తమ పేర్లు కాదని రిమాండ్లో ఉన్న సీనియర్ విద్యార్థులు బుకాయిస్తున్నారు. కానీ.. తాజాగా బయటపడ్డ రెండో డైరీలో మాత్రం వారి ముగ్గురి పేర్లను రిషితేశ్వరి స్పష్టంగా రాసుకుంది. శ్రీనివాస్, జయచరణ్లు తమను ప్రేమించాలంటూ తనను తీవ్ర వేధింపులకు గురిచేసేవారని, పలుమార్లు అసభ్యంగా కూడా ప్రవర్తించారని ఆమె ఈ రెండో డైరీలో పేర్కొంది. అయితే.. ఈ విషయం తల్లిదండ్రులకు తెలిస్తే బాధపడతారనే ఉద్దేశంతో తాను చెప్పలేకపోయినట్లు రాసుకుంది. ఇక వారిద్దరితోపాటు హనీషా సీనియర్లతో ప్రేమ వ్యవహారం కొనసాగించాలంటూ తనపై పదేపదే ఒత్తిడి తీసుకొచ్చిందని తెలిపింది. అలా చేయడానికి ఒప్పుకోక పోవడంతో తాను సోదరుడిగా భావించే జితేంద్రతో తనకు అక్రమ సంబంధం వున్నట్లుగా వారు ముగ్గురు ప్రచారం చేశారని, తనని అడుగడుగునా వేధించారని డైరీలో రాసింది.
ఈ రెండో డైరీలో మరో కీలక విషయాన్ని రిషితేశ్వరి రాసుకుంది. ఆ ముగ్గురు విద్యార్థులు తనను తరుచూ వేధించడమే కాకుండా మరో ఇద్దరు విద్యార్థులు అభిషేక్, ఆదిత్య కూడా తమను ప్రేమించమంటూ ప్రతిపాదించారని ఆమె పేర్కొంది. వారిద్దరు తనను అలా అడగడంపై తాను షాక్కు గురయ్యానని.. దాంతో ఎవరిని నమ్మాలో, ఎవరితో స్నేహంగా ఉండాలో తెలియని అయోమయ స్థితిలోకి వెళ్ళిపోయానని వెల్లడించింది. సీనియర్ల వేధింపులతో తాను సగం చచ్చిపోయినట్లు అనిపించిందని ఆమె ఆవేదనను కళ్లకు కట్టినట్లు రాసుకుంది. ఈ విధంగా తాను రాసుకున్న రిషితేశ్వరి డైరీని అందుకున్న పోలీసులు.. అందులో వున్న చేతిరాత రిషితేశ్వరిదా? కాదా? అనే విషయాన్ని నిర్ధారించుకునేందుకు గుంటూరు పోలీసులు దాన్ని హైదరాబాద్లోని ల్యాబ్కు పంపినట్లు సమాచారం. అలాగే.. ఈ డైరీలోని మరికొన్ని విషయాలు ఇంకా బయటపడాల్సి ఉంది.
AS
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more