లలిత్ మోదీ వ్యవహారంతో పార్లమెంట్ ఉభయ సభల్లో మాటల తూటాలు పేలాయి. మీరెంతా అంటే మీరెంతా అని అధికార, ప్రతిపక్ష పార్టీల నాయకులు వాదోపవాదాలు సాగాయి. లలిత్ మోదీ వ్యవహారంలో కేంద్ర విధేశీ వ్యవహారాల మంత్రి సుష్మస్వరాజ్ మీద మాటల దాడికి దిగారు ప్రతిపక్ష నాయకులు. అయితే కాంగ్రెస్ నాయకులు పదే పదే సుష్మా స్వరాజ్ ను టార్గెట్ గా చెయ్యడంతో సుష్మా వారికి కౌంటర్ ఎటాక్ చేశారు. గతంలో జరిగిన కాంగ్రెస్ పార్టీ నిర్వాకాలను బిజెపి మంత్రి ఎండగట్టారు. ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ మీద పంచులు వేశారు. ఈ సారి వేసవి సెలవుల్లో రాహుల్ తన తల్లి సోనియా గురించి, గతంలో చేసిన స్కాంల గురించి ప్రశ్నించారు.
సుష్మాస్వరాజ్ మాటల తూటల వర్షం గురించి అందరికి తెలుసు. పార్లమెంటేరియన్ గా ఎన్నో సార్లు తన సేవలను అందించిన సుఫ్మా స్వరాజ్ కు ప్రతిపక్షాలు కోపం తెప్పించాయి. తన మీద వచ్చిన ప్రతి ఆరోపణ మీద తాను వివరణ ఇవ్వడానికి సిద్దంగా ఉన్నానని.. ప్రతిపక్షాలు చర్చకు ముందుకు రావాలని.. ఆందోళనలు విరమించాలని చేతులెత్తికోరారు. కానీ ప్రతిపక్షాలు మాత్రం ఆమె మాటలు చెవిన పెట్టలేదు. సుష్మ స్వరాజ్ రాజీనామా చెయ్యాలని డిమాండ్ చేస్తూ నినాదాలు చేశారు. కాంగ్రెస్ నాయకుల చేష్టలతో తీవ్ర కోపానికి గురైన సుష్మా కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ మీద అంతెత్తుకు లేచారు.
ఈ సారి సెలవురోజుల్లో ఏకాంతంలో కూర్చొని కాంగ్రెస్ పార్టీ చరిత్రను, కుటుంబ చరిత్రను చదువుకోమని కేంద్ర మంత్రి సుష్మస్వరాజ్ రాహుల్కు సలహా ఇచ్చారు. బోఫోర్స్ కుంభకోణంలో ఖత్రోచీని, భోపాల్ గ్యాస్ దుర్ఘటనలో వారెన్ ఆండర్సన్ను ఎందుకు వదిలిపెట్టారో మీ అమ్మ సోనియాను అడుగు తెలుస్తుందంటూ రాహుల్కు చురకలంటించారు. తానెప్పుడూ రహస్యంగా పనులు చేయలేదని, ఆ సంస్కృతి ఆది నుంచీ కాంగ్రెస్దేనని సుష్మ విరుచుకుపడ్డారు. నాడు ఖత్రోచి తప్పించుకుని పారిపోవడానికి సహకరించింది రాహుల్ తండ్రి రాజీవేనన్నారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more