‘జనసేనాధిపతి, పవర్ స్టార్ పవన్ కల్యాణ్ గత ఎన్నికల సమయంలో టీడీపీ, బీజేపీ కూటమి తరఫున విస్త్రత ప్రచారం చేశారు. ఆ సందర్భంగానే ఆయన.. ప్రజలకు అన్యాయం జరిగితే సహించేది లేదని, వారి తరఫున ప్రశ్నించేందుకు తాను గొంతెత్తుతానంటూ స్పష్టం చేశారు. కానీ.. ఇప్పుడు ప్రజలకు ఇంత అన్యాయం జరుగుతుంటే వారి తరఫున ఎందుకు గొంతు విప్పడం లేదు.. వారి తరపున పోరాడకుండా ట్విట్టర్లోనే ఎందుకు స్పందిస్తున్నారు’ అని వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యే రోజా తాజాగా విమర్శించారు. ప్రజలక పక్షాన వుంటూ, అన్యాయాలపై ప్రశ్నిస్తానని మాటిచ్చిన పవన్.. ఇప్పుడెందుకు సైలెంట్ గా వున్నారంటూ ఆమె ప్నశ్నించింది.
ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా ఇవ్వాలనే డిమాండ్తో వైఎస్ఆర్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో ఢిల్లీలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగానే పురస్కరించుకుని పవన్ కల్యాన్ పై రోజా ప్రశ్నల వర్షం కురిపించారు. ఈ క్రమంలోనే ఆమె మాట్లాడుతూ.. మహిళా తహశీల్దార్ వనజాక్షిపై టీడీపీ నాయకులు దౌర్జన్యం చేస్తే పవన్ ఎందుకు స్పందించలేదని నిలదీశారు. డ్వాక్రా మహిళలకు అన్యాయం జరుగుతోందని, రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని.. ఈ విషయాలపై పవన్ ఎందుకు మాట్లాడటం లేదని ప్రశ్నించారు. ప్రత్యేక హోదా గురించి పవన్ ఎందుకు ప్రశ్నించడం లేదని ఆమె అడిగారు. ప్రశ్నిస్తానని ఆనాడు చెప్పిన పవన్ గొంతును ఇప్పుడు మాట్లాడకుండా ఏ ప్యాకేజీ గొంతు నొక్కుతోందని రోజా అన్నారు.
ప్రత్యేక హోదా కోసం పోరాటం చేస్తున్న వైఎస్ జగన్కు పవన్ కల్యాణ్ సంఘీభావం తెలిపాల్సిందేనని ఆమె పేర్కొన్నారు. ఏపీకి ప్రత్యేక హోదా, జరుగుతున్న అన్యాయాలపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను నిలదీయాలని పవన్కు రోజా సూచించారు. మరి.. రోజా చేసిన ఘాటు వ్యాఖ్యలపై పవన్ ఏ విధంగా స్పందిస్తారోనని ఆసక్తి నెలకొంది.
AS
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more