సెప్టెంబర్ నుండి ఏపిలో అంగన్వాడీ సిబ్బంది వేతనాలు పెరగనున్నాయి. అంగన్వాడీ వర్కర్తోపాటు ఆయాలకు వేతనాలు పెంచాలని మంత్రివర్గ ఉపసంఘం ప్రతిపాదించింది. ఉపసంఘం తన నివేదికను ఆర్ధికశాఖ మంత్రి యనమల రామకృష్ణుడుకి అందజేసింది. కమిటీ నివేదికను సమర్పించిన అనంతరం మంత్రులు అచ్చెన్నాయుడు, పీతల సుజాత సచివాలయంలో మీడియాతో మాట్లాడారు. అంగన్వాడీ సిబ్బంది వేతనాలను పెంచాలని మంత్రివర్గ ఉపసంఘం ప్రతిపాదనలు సిద్దం చేసిందని మంత్రులు తెలిపారు.
ప్రస్తుతం అంగన్వాడీ వర్కర్కు నెలకు 4200 ఇస్తున్నారని, దానిని 7100కు పెంచు తున్నట్టు తెలిపారు. మిని అంగన్వాడీ వర్కర్కు ప్రస్తుతం 2950 ఇస్తుండగా దానిని 4600, ఆయాకు ప్రస్తుతం 2400 ఇస్తుంటే అది కూడా 4600 పెంచాలని నిర్ణయించినట్టు తెలిపారు. అంగన్వాడీ సిబ్బందికి పెంచిన వేతనాల మూలంగా రాష్ట్ర ప్రభుత్వంపై ఏడాదికి 317 కోట్ల భారం పడుతుందని మంత్రులు చెప్పారు. ప్రస్తుతం ఏడాదికి 406 కోట్ల ఖర్చు అవుతుండగా వేతనాలు పెరిగిన అనంతరం అదికాస్త 723కోట్లు అవుతుందన్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అంగన్వాడీలకు ఇచ్చిన హామి మేరకు వేతనాలు పెంచాలని మంత్రివర్గ ఉపసంఘం ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపిం చిందన్నారు. సీఎం విదేశీ పర్యటన నుండి రాగానే దీనిపై నిర్ణయం తీసుకుంటారని చెప్పారు.
రానున్న మంత్రివర్గ సమావేశంలోనూ చర్చించిన అనంతరం సెప్టెంబర్ నెల నుండి పెరిగిన వేతనాలను అమలు చేస్తామని మంత్రులు స్పష్టం చేశారు. రాష్ట్రంలో 1,04, 377 మంది అంగన్వాడీ సిబ్బంది ఉన్నా రని మంత్రులు తెలిపారు. మాతాశిశు మరణాల తగ్గింపులో అంగన్ వాడీల పాత్ర చాలా కీలకమని మంత్రి పీతల సుజాత తెలిపారు. అంగన్వాడీలకు అదనపు పనులను అప్పగించ వద్దని నిర్ణయించి నట్టు తెలిపారు. అంగన్వాడీ కేంద్రాలను ఉదయం 9 నుండి సాయంత్రం 4 గంటల వరకు తెరచి ఉంచాలని పాలుతాగే పిల్లలకు పోషకాహారం అందించడం, బాలింతలకు పౌష్టికాహారాన్ని అందిం చాలని మంత్రి సూచించారు. వేతనాలు పెరిగిన నేపథ్యంలో అంగన్ వాడీలు ఇంకా బాగా పనిచేయాలని మంత్రి సుజాత ఆదేశించారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more