ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు సెటిల్మెంట్ సీఎంగా మారిపోయారని వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యే రోజా విమర్శించారు. ఎన్నికల ముందు నోటి నుంచి మాట వచ్చిన ప్రతీసారి ఆడవాళ్లను, అక్కచెలెళ్లు అంటూ ప్రస్తావించి.. అధికారంలోకి వచ్చిన ఆయన.. తన పాలనలో అక్కాచెలెళ్లకే సవాళ్లు ఏర్పడిందే, మానప్రాణాలకు రక్షణ కరువవుతుంటే.. నిర్లక్ష్య వైఖరిని అవలంభిస్తున్నారని విమర్శించారు. ఎమ్మార్వో వనజాక్షి విషయంలో ఆమెను ఇంటికి పిలిపించి సెటిల్మెంట్ చేశారని, ఇక ఆత్మహత్య చేసుకున్న రిషితేశ్వరి తల్లిదండ్రులకు రూ.10లక్షల నగదు, 500 గజాల భూమిని ఇచ్చి సెటిల్ చేస్తున్నారని ఆమె మండిపడ్డారు. ఓ ఆడపిల్ల జీవితం ఖరీదు రూ.10లక్షలా అని రోజా సూటిగా ప్రశ్నించారు. మహిళల ఓట్లతో అధికారంలోకి వచ్చిన చంద్రబాబు...ఇప్పుడు మహిళల సమస్యల గురించి పట్టించుకోవడం లేదని ఆమె మండిపడ్డారు.
రిషితేశ్వరి ఆత్మహత్య కేసును ప్రభుత్వం డబ్బులతో సెటిల్ చేయాలని చూస్తుందని ఆమె ఆరోపించారు. ఆచార్య నాగార్జున యూనివర్శిటీలో ఆర్కిటెక్చర్ విద్యార్థిని రిషితేశ్వరి ఆత్మహత్యపై ప్రతిపక్ష వైఎస్ఆర్ సీపీ ఏర్పాటు చేసిన నిజనిర్ధారణ కమిటీ గురువారం యూనివర్శిటీకి వెళ్లింది. అయితే కమిటీలోని మహిళ ఎమ్మెల్యేలు, నాయకులను పోలీసులు అడ్డుకున్నారు. దాంతో స్థానికంగా ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. ఈ సందర్భంగా వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యే రోజా మాట్లాడుతూ.... రిషితేశ్వరీ ఆత్మహత్య కేసులో కళాశాల ప్రిన్స్పాల్ బాబురావు ప్రధాన ముద్దాయిగా చేర్చాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
అధికార పార్టీ అండతోనే ప్రిన్సిపల్ రెచ్చిపోయాడని ఆమె విమర్శించారు. క్యాంపస్లో ర్యాగింగ్ జరుగుతుందని విద్యార్థులు ప్రిన్సిపాల్ వద్దకు వెళ్లి ఫిర్యాదు చేసిన ఆయన పట్టించుకోలేదన్నారు. విద్యార్థులకు విద్యాబుద్దలు నేర్పాల్సిన ప్రిన్సిపాల్.. వారితో కలసి నైట్ క్లమ్ లకు వెళ్లి తెల్లవారేదాకా తైతక్కలు అడే బాబురావు ప్రిన్సిపాల్ ఎలా అవుతాడని ఆమె ప్రశ్నించారు. రిషితేశ్వరి కుటుంబానికి న్యాయం జరిగే వరకు వదిలి పెట్టమని రోజా స్పష్టం చేశారు. ఈ కేసులో నిజానిజాలు వెలుగు చూడాలంటే.. నిప్పక్షపాత్ర విచారణ అవసరమని డిమాండ్ చేశారు.
జి. మనోహర్
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more