అంతా సవ్యంగా సాగివుంటే.. ఆ అమ్మాయి అతడికి సతీమణి. అతగాడు అమెకు పెనిమిటి. ఇదేం ప్రేమ వివాహం కాదు.. పెద్దలు కుదుర్చుకున్న వివాహమే. కుందనపు బోమ్మలా ఉన్న ఆ ఆమ్మాయిని చూసి చూడగానే పెళ్లి చేసుకుంటానని చెప్పాడు. నిశ్చితార్థం కూడా చేసుకున్నాడు. ఆ తరువాత మరో డబ్బుగల సంబంధం వచ్చిందో ఏమె.. లేక ఆటపట్టించడానికే అన్నాడో తెలియదు కానీ అమ్మాయి నచ్చలేదని అన్నాడు. అప్పటి వరకు తన పెళ్లిని ఊహించుకుంూ ఆశల పల్లకిలో తేలియాడుతున్న యువతికే నేరుగా ఆ యువకుడు ఫోన్ చేసి విషయాన్ని చెప్పాడు. దీంతో మనస్థాపానికి గురైన ఓ యువతి ఉరేసుకొని ఆత్మహత్య చేసుకుంది.
ఈ సంఘటన బాలానగర్ ప్రాంతంలో చోటు చేసుకుంది. బాలానగర్ సీఐ సైదులు తెలిపిన విరాల ప్రకారం. నిజామాబాద్ జిల్లా బోధన్కు చెందిన భూలక్ష్మి తన ఇద్దరు పిల్లలతో సహా వినాయక్నగర్లో నివాసముంటోంది. ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్న ఆమె తన కుమార్తె అనూషగౌడ్కు నిజామాబాద్ జిల్లాకు చెందిన సందీప్గౌడ్ (26)తో వివాహం చేసేందుకు పెద్దల సమక్షంలో సంబంధం కుదరుర్చకుంది. ఇందులో భాగంగా జూన్ 7న నిశ్చితార్థం జరిగింది. అప్పటి నుంచీ కాబోయే దంపతులిద్దరు తరచూ ఫోన్లో మాట్లాడుకునేవారు.
ఇదిలా ఉండగా మరో సంపన్నుల సంబంధం వచ్చిందో.. లేక మరే కారణమో తెలియదు కానీ మంగళవారం అనూషకు ఫోన్ చేసిన సందీప్గౌడ్.. ‘‘నువ్వంటే నాకిష్టం లేదు. వేరే అబ్బాయిని పెళ్లి చేసుకో’’ అని చెప్పడంతో అమె మనస్థాపానికి లోనైంది. తన తల్లికి ఫోన్ చేసి విషయం చెప్పింది. దీంతో ఆమె ఇంటికి వచ్చి కుమార్తెను ఓదార్చి తిరిగి డ్యూటీకి వెళ్లిపోయింది. ఇదిలా ఉండగా తాను ఊహించుకున్న కలల ప్రపంచం తనకు అందకుండానే అదృశ్యం కావడంతో తీవ్ర మనోవేధనకు గురైన అనూష సాయంత్రం వంటగదిలో కొక్కేనికి ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ఆమెను స్థానికంగా ఉన్న ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకెళ్లగా అప్పటికే మృతి చెందిందని డాక్టర్లు తెలిపారు.
జి.మనోహర్
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more