ఆంధ్రప్రదేశ్ లోని గుంటూరు నాగార్జున విశ్వవిద్యాలయంలో జెడలు విప్సిన ర్యాగింగ్ భూతం అమాయక విద్యార్ధినిన పోట్టన పెట్టుకుందన్న విషయాన్ని పోలీసులు ధృవీకరించారు. ప్రస్తుతం నవ్యాంధ్ర రాష్ట్రాన్ని కుదుపేస్తోన్న రిషితేశ్వరి ఆత్మహత్యకు కారణం ఎవరు? ఆమె ఆత్మహత్య చేసుకోవాల్సిన పరిస్థితి ఎందుకొచ్చిందనేదానిపై అమె రిమాండ్ డైరీలో ఆసక్తికర విషయాలు బయటపడ్డాయి. తన సీనియర్ల చేతిలో అమె ఎలా చిక్కుకుందో.. వారి వేధింపులకు ఎలా భరించిందోనని పోలీసులు విస్మయానికి గురయ్యారు. రిషితేశ్వరి ఆత్మహత్యకు గల కారణాలన్నింటినీ అమె రిమాండ్ డైరీలో పూసగచ్చినట్లు పోలీసులు వివరించారు.
నాగార్జునా యూనివర్సిటీలో మే 18న నిర్వహించిన ప్రెషర్స్ డే వేడుకల్లో రిషేతేశ్వరి పాల్గొనింది. ఈ క్రమంలో ఆమె పట్ల ముగ్గురు విద్యార్ధులు అసభ్యంగా ప్రవర్తించారు. ఫ్రేషర్స్ డే వేడుకల సాక్షిగానే అమె సీనియర్ల వేధింపులకు గురైంది. అంతటితో ఆగకుండా కొన్ని రోజుల పాటు రిషితేశ్వరీ వెంట పడి మానసికంగా, శారీరకంగా వేధించారని రిమాండ్ డైరీలో పోలీసులు పేర్కొన్నారు. పలుమార్లు అవమానించడంతో.....తీవ్ర మనస్తాపానికి గురైన రిషితేశ్వరి తల్లిదండ్రులకు కూడ చెప్పుకోకుండా తన హాస్టల్ గదిలో ఫ్యాన్కు ఉరి వేసుకుని మృతి చెందినట్లు తెలిపారు. మధ్యాహ్నం తన సహచర విద్యార్థినులు వచ్చి చూసేసరికి అమె ఉరి వేసుకుని వుందని, అమెను హుటాహుటిన అస్పత్రికి తరలించగా, అప్పటికే మృతిచెందిందని వైద్యులు నిర్థారించారని రిమాండ్ డైరీలో పోలీసులు పేర్కోన్నారు. రిషితేశ్వరి మృతికి కారణమైన ముగ్గురు విద్యార్ధులను పోలీసులు అరెస్ట్ చేశారు
ఇదిలావుండగా, రిషితేశ్వరి ఆత్మహత్య ఉదంతంలో నిజాలను నిగ్గుతేల్చేందుకు ఏర్పాటు చేసిన నలుగురు సభ్యుల కమిటీ విచారణను ప్రారంభించడంపై మృతురాలి తల్లిదండ్రులు అభ్యంతరాన్ని వ్యక్తం చేస్తున్నారు. నాగార్జునా విశ్వవిద్యాలయానికి పది రోజుల పాటు సెలవులను ప్రకటించిన నేపథ్యంలో ఇప్పుడు విచారణ జరిపితే నిజాలు వెలుగులోకి రావని వారు అందోళన వ్యక్తం చేస్తున్నారు. తమ బిడ్డ ఆత్మహత్య కేసులో నిజాలు వెలుగుచూడాలంటే తరగతులు జరుగుతున్నప్పుడు విచారణ జరిపించాలని వారు కోరారు.
జి.మనోహర్
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more