రాహుల్ గాంధీ అనంతపురం పర్యటనలో భాగంగా అన్ని పక్షాలను ఉతికి ఆరేశారు. నిజాయితీకి మారు పేరు, మాటకు కట్టుబడి ఉండే పార్టీ, ప్రభుత్వం అంటే మాదే, అధికారం అంటే మేమే చెయ్యాలి అన్నట్లుగా రాహుల్ ఊకదంపుడు ఉపన్యాసం చేశారు. అటు టిడిపి, బిజెపిలతో పాటు వైసీపీలను కూడా విమర్శలల్లో ముంచారు. ఏపి ప్రజలకు తాము అండగా ఉంటాం అన్నట్లు మాట్లాడిన రాహుల్ చాలా విషయాలను మరిచిపోయినట్లు కనిపించింది. ఎందుకంటే రాహుల్ మాటల్లో పాపం మొత్తం మోదీ సర్కార్ దే అన్నట్లు, చేతగాని టిడిపి నేతల నిర్వాకం అంటూ చిలుకపలుకులు పలికారు. అయినా పక్కవాడి మీద వేలెత్తి చూపాలంటే ముందు తమ తప్పులు తెలుసుకోవాలి అన్న వేమన గారి మాట రాహుల్ గాంధీకి తెలుసోలేదో. అయినా రాహుల్ గాంధీ కూడా ఏపికి అన్యాయం చేసిన బ్యాచ్ లో మెంబరే మరి ఇప్పుడు ఎందుకు అలా మాట్లాడుతున్నారు అంటే అందరికి అర్థమవుతుంది.
రాహుల్ వీటికి సమాధానాలు ఉన్నాయా...
* ఏపి విభజన బిల్లును అమలు చెయ్యడం లేదు అని ప్రశ్నిస్తున్నారు. మరి మీరు పార్లమెంట్ లో దీని మీద మాట్లాడటానికి ప్రయత్నం చేశారా..?
* ఏపికి అసలు అన్యాయం జరిగింది అంటున్నారు కానీ ఎవరు చేశారు..?
* విభజన బిల్లును చెత్త కుప్పలాగా.. అసంపూర్తిగీ తీసుకువచ్చింది మీ ప్రభుత్వం కాదా..?
* మీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడే ప్రత్యేక హోదా ప్రకటిస్తూ బిల్ తీసుకురావచ్చు కదా..? అలా ఎందుకు చెయ్యలేదు..?
* ఏపి ఏర్పడి ఏడాది దాటిపోయింది. మరి ఇప్పుడు ఎందుకు ఏఫి మీద ఇంత ప్రేమ పొంగుకువచ్చింది. ?
* బిజెపిని, టిడిపిని, వైసీపి ఎత్తిపోడుస్తున్నారుగా మరి మీ పార్టీ, మీ నాయకులు పొడిచింది ఏమిటి..?
* తెలుగు వారికి అన్యాయం చేసిన పాపంలో మీ వాటా కూడా లేంటారా..?
* ఇప్పుడు వచ్చి చిలుక పలుకులు పలికితే అంతా సర్దుబాటు అవుతుందని మీరు భావిస్తున్నారా..?
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more