బొగ్గు స్కామ్.. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన భారీ కుంభకోణం. ఈ కుంభకోణంలో ప్రధాన నిందితులుగా ఆరోపణలు ఎదుర్కొంటున్న జాబితాలో యూపీఏ మినిస్టర్ సంతోష్ బగ్రోడియా కూడా వున్నారు. ఇప్పటికే ఈయన మీద సీబీఐ చార్జిషీటు దాఖలు చేసింది కూడా! అయితే.. ఆయన్ను ఈ కేసు నుంచి బయటపడివేసేందుకు కొందరు వ్యక్తులు తీవ్రస్థాయిలో ప్రయత్నాలు చేస్తున్నారు. అదికూడా నేరుగా కొందరు కాంగ్రెస్ నేతలే రంగంలోకి దిగడం విశేషంగా మారింది. గుట్టుచప్పుడు కాకుండా లోలోపలే ఈ వ్యవహారాన్ని కానిచ్చేందుకు కాంగ్రెస్ బాగానే శ్రమిస్తోందని అంతర్గతంగా వస్తున్న సమాచారం. కానీ.. కాంగ్రెస్ చేస్తున్న ఈ రహస్య ప్రయత్నానికి సుష్మ రూపంలో పెద్ద ఝలక్ తగిలినట్లు తెలుస్తోంది. ఎందుకంటే.. ఓ కాంగ్రెస్ నేత ఈ వ్యవహారంలో తప్పటడుగు వేసినట్లు తెలిసింది.
బొగ్గు స్కాంలో నిందితుడిగా వున్న సంతోష్ కు పాస్ పోర్టు ఇప్పించాలంటూ ఏకంగా విదేశాంగశాఖ మంత్రి సుష్మా స్వరాజ్ పై ఒత్తిడి చేశాడట. ఈ విషయాన్ని స్వయంగా ఆమె వెల్లడించింది. సంతోష్ కు డిప్లమాటిక్ పాస్ పోర్టును ఇప్పించాలని ఓ ప్రముఖ కాంగ్రెస్ నేత తనపై తీవ్ర ఒత్తిడిని తెచ్చారని, ఆయన బండారాన్ని పార్లమెంటు వేదికగా బట్టబయలు చేస్తానని ఆమె తన ట్విటర్ ఖాతాలో ట్వీట్ చేశారు. బుధవారం ఉదయం 8 గంటల సమయంలో ఆమె పై విధంగా ట్వీట్ చేయగా.. వెంటనే ఆ నేత పేరు బహిర్గతం చేయాలంటూ నెటిజన్లు కామెంట్లు చేశారు. అయితే.. తాను మాత్రం అతని పేరును పార్లమెంటులోనే ప్రస్తావిస్తానని సుష్మా సమాధానం ఇచ్చారు. ఇదిలావుండగా.. 2008-09 మధ్యకాలంలో సంతోష్ బగ్రోడియా కేంద్ర బొగ్గుశాఖ సహాయమంత్రిగా విధులు నిర్వర్తించిన సంగతి తెలిసిందే! ఆయన హయాంలోనే ఈ బొగ్గు స్కాం జరిగింది.
AS
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more