గోదావరి మహా పుష్కరాలలో పుష్కర స్నానం చేసి తరించడానికి ఎన్నో లక్షల మంది భక్తులు వస్తున్నారు. అయితే కరీంనగర్ కు వచ్చిన ఓ వ్యక్తిని చూసి మాత్రం అందరు ఆశ్చర్యనపోయారు. మీడియా వాళ్లయితే ఆ చుట్టూనే తిరుగుతూ కూర్చున్నారు. అయితే ఎందుకు ..? ఎవరు..? అని మీకు డౌట్ వస్తుంటుంది. అయితే ా వ్యక్తి ఎవరో కాదు రాష్ట్ర విభజన సమయంలో తెగ హడావిడి చేసి.. శపథం చేసిన లగడసాటి రాజగోపాల్. అవును అయితే కరీంనగర్ లో ఆయన పుష్కరస్నానం చెయ్యడం ఒక్కటే కాకుండా కేసీఆర్ ను మెచ్చుకున్నారు. అవును మీరు చదువుతున్నది నిజమే.. లగడపాటి కేసీఆర్ ను మెచ్చుకున్నారు.
పవిత్ర గోదావరి నది తెలుగవారినందరినీ ఒకటిగా కలపాలని, రెండు రాష్ట్రాలు అభివృద్ధి చెందాలని ఆకాంక్షిస్తున్నట్లు విజయవాడ మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్ అన్నారు. కొత్త రాష్ట్రమైనా తెలంగాణలో పుష్కర ఏర్పాట్లు బాగున్నాయని, భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా సీఎం కేసీఆర్ ప్రత్యేక చొరవతో ఏర్పాట్లు చేయించడం అభినందనీయమని ఆయన కొనియాడారు. కరీంనగర్ జిల్లా మంథనిలో కుటుంబసభ్యులతో కలిసి ఆయన పుష్కర స్నానమాచరించారు. కాళేశ్వరంలో పుష్కర స్నానం చేశారు. త్రిలింగ క్షేత్రాల్లో, త్రివేణి సంగమాల్లో ఒక్కటైన శ్రీ కాళేశ్వర క్షేత్రాన్ని దర్శించుకొవాలని మూడేళ్లుగా అనుకుంటున్నప్పటికీ ప్రత్యేక పరిస్థితుల వల్ల రాలేకపోయానన్నారు. మొత్తానికి గోదారమ్మ కలిపింది ఇద్దరినీ అంటూ కొంత మంది విమర్శకులు అంటున్నారు. విభజన జరిగితే తెలంగాణలో కనీసం కాలు కూడా పెట్టనని అన్న లగడపాటి.. మొత్తానికి గోదావరి మహా పుష్కరాల నేపథ్యంలో తెలంగాణలోనే పుష్కర స్నానం చెయ్యడం విశేషం.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more