అంగరంగ వైభవంగా ప్రారంభమైన గోదావరి మహా పుష్కరాల్లో మహా విషాదం చోటు చేసుకున్న ఘటనపై ఏకంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపైనే జాతీయ మానవ హక్కుల సంఘానికి పిర్యాదు వెళ్లింది. ఈ పుష్కరాల సందర్భంగా రాజమండ్రిలోని కోటగుమ్మం వద్ద చోటు చేసుకున్న తొక్కిసలాటలో మృతుల సంఖ్య అమాంతం పెరుగుతూనే వుంది. ఘటన జరిగిన తరువాత 15 మంది అక్కడికక్కడే ప్రాణాలను కోల్పోయారు, ఆ తరువాత ఆసుపత్రులలో చికిత్స పోందుతూన్న వారు మరణించడంతో క్రమంగా ఘటన మృతుల సంఖ్య పెరుగుతోంది. తాజాగా ప్రభుత్వ లెక్కల ప్రకారం 32 మంది దుర్మరణం పాలయ్యారు.
ఏపీ ప్రభుత్వం వందల కోట్ల రూపాయలు వెచ్చించి ఏర్పాట్లు చేసినప్పటికీ.. ఏమాత్రం ప్రయోజనం లేకుండా పోయింది. దీంతో సీఎం చంద్రబాబుపై విపక్ష నేతలు తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. చంద్రబాబు పుష్కరాలకు తగిన ఏర్పాటు చేయలేదని, ఆయన నిర్లక్ష్యం వల్లే ఈ ఘటన చోటు చేసుకుందని.. ఘటనకు ఆయన ప్రభుత్వ వైఫల్యమే కారణమని, ఆయన వెంటనే తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఓవైపు బాబుపై ఈ విమర్శలపపర్వం కొనసాగుతుండగానే ఆయనపై జాతీయ మానవ హక్కుల సంఘంలో పిర్యాదు కూడా అందింది.
పుష్కరాల్లో చోటు చేసుకున్న ఘటనకు చంద్రబాబే కారణమంటూ వీరరాఘవరెడ్డి అనే న్యాయవాది ఆయనపై జాతీయ మానవ హక్కుల సంఘం (ఎన్.హెచ్.ఆర్.సి)లో ఫిర్యాదు చేశారు. పుష్కరాలకు బాబు తగిన ఏర్పాటు చేయలేదని, తొక్కిసలాట ఘటన చోటు చేసుకోకుండా చర్యలు తీసుకోవడంలో ఏపీ సర్కార్ పూర్తిగా విఫలమైందని ఆయన తన ఫిర్యాదులో పేర్కొన్నాడు. ఈ వ్యవహారంపై పూర్తిస్థాయిలో విచారణ జరిపించాలని ఆయన కోరారు. ఈ ఫిర్యాదును ఎన్.హెచ్.ఆర్.సి విచారణకు స్వీకరించింది. ఇప్పటికే ‘ఓటుకు నోటు’, ‘ఫోన్ ట్యాపింగ్’ వంటి వ్యవహారాలతో తలమునకలైపోతున్న చంద్రబాబుకు తాజాగా పుష్కరాల ఘటన మరింత ఆందోళనల్లో ముంచేసింది. ప్రస్తుతం బాబు పరిస్థితి చూస్తుంటే.. ‘అదృష్టం వచ్చి బాబుకు షేక్ హ్యాండ్ ఇచ్చే లోపే పుష్కరాల ఘటన రూపంలో దురదృష్టం వచ్చి లిప్ కిస్ ఇచ్చినట్లు’ వుంది.
జి.మనోహర్
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more