గడిచిన సార్వత్రిక ఎన్నికల్లో ఓటమిపాలైన వైఎస్ఆర్ కాంగ్రెస్ అధ్యక్షుడు జగన్ మోహన్ రెడ్డి.. ప్రజల్లో మరింత మమేకమయ్యేందుకు ఎన్నో విధాలుగా ప్రయత్నిస్తూనే వున్నారు. అందులో భాగంగానే ఆయన ఇప్పటికే ఎన్నో పాదయాత్రలు చేశారు. ప్రజల సమస్యల్ని నేరుగా తెలుసుకోవడంతోపాటు వారి ఎమోషన్స్ తో, తమ ఫీలింగ్స్ కనెక్ట్ చేసి వారి మనసుల్ని దోచేసుకున్నారు. ఇలా అనేక సందర్భాల్లో తన చతురతను చాటుకున్న జగన్.. తాజాగా ఓ అరుదైన నిర్ణయం తీసుకుని తాను కూడా అవగాహన వున్న రాజకీయ నాయకుడిగా మరోసారి నిరూపించుకోవడంతోపాటు ఆంధ్రులకు మరింత దగ్గరయ్యారని సమాచారం! ఇంతకీ ఆయన ఏం చేశారు? అనేగా మీ సందేహం! ఆ వివరాలు తెలియాలంటే మేటర్ లోకి వెళ్లాల్సిందే..
ప్రస్తుతం రెండు తెలుగు రాష్ర్టాల్లో గోదావరి పుష్కరాలు ఘనంగా సాగనున్న విషయం సంగతి తెలిసిందే. 12 ఏళ్లకోసారి జరిగే ఈ కార్యక్రమానికి దేశవ్యాప్తంగా వుండే ప్రజలతోపాటు దాదాపు అన్ని పార్టీల నాయకులు హాజరవుతున్నారు. అయితే స్వతహాగా క్రిస్టియన్ అయిన జగన్ పుష్కరాలకు విచ్చేస్తారా? ఆయన పుష్కరస్నానం చేస్తారా? అనే అనుమానాలు వ్యక్తమయ్యాయి. ఈ వార్తలు అలాఇలా చక్కర్లు కొడుతూ చివరికి వైకాపా వర్గాలకు చేరగా.. ఆ పార్టీ శాసనసభ పక్ష ఉప నేత జ్యోతుల నెహ్రూ అందరికి షాక్ తగిలేలా సమాధానం ఇచ్చారు. 15వ తేదీన తేదీన జగన్ రాజమండ్రి వస్తారని.. ఆ తర్వాత పుష్కర స్నానం కచ్చితంగా ఆచరిస్తారని ఆయన చెప్పారు. ఈ వార్తలు విన్న ఆంధ్రప్రజలు.. జగన్ నిర్ణయానికి దాసోహమైనట్లుగా వార్తలొస్తున్నాయి.
ఎందుకంటే.. రాజకీయ నాయకులకు తమకంటూ వ్యక్తిగత అబిప్రాయాలు, నమ్మకాలు ఎన్ని వున్నప్పటికీ.. ప్రజలకు అనుగుణంగా కొన్ని వ్యవహారాలను అనుసరిస్తే అందుకు వారు దాసోహం అవుతారని రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం. ఈ విషయాన్ని జగన్ బాగానే ఒడిసిపట్టుకున్నారని వారు భావిస్తున్నారు.
AS
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more