కేసీఆర్ చేస్తున్న కృషిని చూసి ఓర్వలేకనే ఎపీ సీఎం చంద్రబాబు ఓ ఉన్నాది.. శాడిస్టులా వ్యవహరిస్తున్నారని టీజీవో వ్యవస్థాపక అధ్యక్షుడు, ఎమ్మెల్యే వీ శ్రీనివాస్గౌడ్ విమర్శించారు. శనివారం సచివాలయంలోని మీడియా పాయింట్లో ఆయన మాట్లాడుతూ సెక్షన్- 8పై చంద్రబాబు కేంద్రానికి లేఖ రాయడం దారుణమని అన్నారు. సీఎంగా ఎన్నో ఏండ్ల అనుభవమున్న చంద్రబాబుకు చట్టాలు తెలియకపోవడం బాధాకరమని ఎద్దేవా చేశారు. సెక్షన్-8ని అమలు చేయాలని లేఖ రాసి తన నిజస్వరూపాన్ని బయటపెట్టుకున్నారిని అన్నారు. హైదరాబాద్లో అల్లకల్లోలం జరిగి ఆస్తుల నష్టం జరిగినప్పుడు మాత్రమే సెక్షన్-8 అమలు చేయాలని విభజన చట్టంలోని 3, 4 క్లాజ్లో స్పష్టంగా పేర్కొన్నారనే అంశాన్ని గుర్తు చేశారు. ఏపీలో మహిళా తహసీల్దార్పై దాడి జరిగిందని, అలాంటి ప్రాంతంలో కఠిన చట్టాలు అమలుచేయాలన్నారు. ప్రశాంతంగా ఉన్న హైదరాబాద్లో సెక్షన్ 8 అమలు చేయాల్సిన అవసరం లేదన్నారు. సెక్షన్-8 అమలు చేయాలని డిమాండ్ చేస్తున్న చంద్రబాబు, అతని తొత్తులపై హైదరాబాద్లో ఉన్న సీమాంధ్ర ప్రజలే తిరుగబడుతారని అన్నారు.
ఏపీ ప్రజల ఆగ్రహానికి గురికాకముందే తప్పును సరిదిద్దుకోవాలని సూచించారు. మహబూబ్నగర్ జిల్లాను 9 ఏండ్లు దత్తత తీసుకుని ఒరగబెట్టిందేమీ లేదని, ప్రస్తుతం ఆ జిల్లా ప్రజల ఉసురుపోసుకునే విధంగా పాలమూరు ఎత్తిపోత పథకాన్ని అడ్డుకునేందుకు ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు. ఈ నెల 13న మహబూబ్నగర్ జిల్లా ప్రజా ప్రతినిధులు, పార్టీల నేతలతో కూడిన అఖిలపక్షం గవర్నర్ను కలిసి చంద్రబాబుపై ఫిర్యాదు చేస్తామని తెలిపారు. అవసరమైతే ప్రధాని, రాష్ట్రపతిని కలుస్తామని అన్నారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more