సవతి తల్లి చేతిలో చిత్రహింసలను అనుభవించి.. ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పోందుతున్న ప్రత్యూష తొలిసారిగా ఈ వ్యవహారంపై స్పందించింది. తన కన్న తండ్రికి, తన సవతి తల్లిని కఠినంగా శిక్షించాలని తాను కోరుకుంటున్నట్లు తెలిపింది. ఎల్బీనగర్ లోని అవేర్ అసుప్రతిలో చికిత్స పోందుతున్న ప్రత్యూష తన అవేదనను మీడియాతో పంచుకుంది. తాను వాళ్లకు పట్టలేదనే కారణంతో ఏడాది కాలంగా తనను టార్చర్ పెడుతూ వచ్చారని వాపోయింది. తనను ప్రతీ క్షణం మానసికంగా, శారీరికంగా చాలారోజుల నుంచి వేధిస్తున్నారని వెల్లడించింది. ఏడాది కాలంగా గదిలో నిర్భంధించి తనను చిత్రహింసలు పెట్టారని తెలిపింది. ముఖ్యంగా ప్రత్యూష తల్లి చాముండేశ్వరి ఏడాది కాలంగా తనను హింసించారిన తెలిపింది.
హెల్త్ బులిటిన్ విడుదల
సవతి తల్లి చేతిలో చిత్రహింసల పాలైన ప్రత్యూష ఆరోగ్యంపై అవేర్ అస్పత్రి వైద్యులు హెల్త్ బులిటన్ విడుదల చేశారు. ప్రస్తుతం ప్రత్యూష ఆరోగ్యం నిలకడగానే వుందని, ఆమె క్రమంగా కోలుకుంటుందని చెప్పారు. మరో వారం రోజుల పాటు వైద్య చికిత్స చేసిన తరువాత అమెను డిశ్చార్చ్ చేస్తామని వైద్యులు తెలిపారు. ప్రత్యూష శరీరంపై బలమైన గాయాలున్నాయిన, అన్నింటీకీ చికిత్స చ ేసినట్లు చెప్పారు. అమె అంతర్గత అవయాలపై కూడా యాసిడ్ తో దాడిచేశారని, సిగరెల్లతో కాల్చి, యాసిడ్ కూడా తాగించినట్లు అవేర్ వైద్యులు వెల్లడించారు. సకాలంలో ఆసుపత్రికి తీసుకురావడంతో ప్రమాదం తప్పిందని వైద్యులు చెప్పారు. ప్రస్తుతం ప్రత్యూషకు రీనల్ ఇంటెన్సివ్ కేర్ యూనిట్ లో గ్యాస్ట్రో , గైనాకలాజీ, పల్మనాలజీ విభాగాల వైద్యులతో ప్రతే్యకంగా చికిత్స నందిస్తున్నట్లు చెప్పారు.
జి. మనోహర్
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more