వింటే భారతం వినాలి.. తింటే గారెలు తినాలి అన్న సామెను ప్రస్తుత రాజకీయ పరిస్థులకు చక్కగా అన్వయించుకుని సినీ నటుడు, జనసేన అధినేత పవన్ కల్యాన్ చెప్పిన డైలాగ్ ఆయన నిర్వహించిన పత్రికా సమావేశంలో నవ్వులు కురిపించింది. అదే కోవలో సీమాంధ్ర ఎంపీలకు లక్ష్యం కోసం పోరాడాలన్న హితబోధను కూడా చేసింది. అదేంటంటే.. తిడితే కేసీఆర్ లా తిట్టాలి.. పడితే పౌరుషం లేని సీమాంధ్ర ఎంపీలా పడాలి అని పవన్ డైలాగ్ చెప్పగానే మీడియా సమావేశంలో నవ్వులు విరబూసాయి. సీమాంధ్ర ఎంపీలకు ఆత్మభిమానం, ఆత్మ గౌరవం లేదా అని అనిపిస్తుందని ఆయన అనుమానం వ్యక్తం చేశారు. ఉత్తరాది ఎంపీలతో కొట్టించుకుని పార్లమెంటు బయటకు వచ్చారని వ్యగంగా అన్నారు.
విజయవాడ ఎంపీ కేశినేని తనకు ఎంపీ సీటు కావాలని బలంగా ఊగిపోయారు. గెలిచిన తరువాత ఇప్పుడేం చేస్తున్నారని ఆయన ప్రశ్నించారు. పార్లమెంటులో గోడలను, పార్లమెంటు అంధాలను చూస్తు పంభ్రమాశ్చరాలకు లోనవుతున్నారా..? అని ప్రశ్నించారు. బీజేపి తరుపున కూడా ఇద్దరు ఎంపీలు వున్నారని విశాఖ నుంచి హరిబాబు, కాకినాడ నుంచి గంగరాజు వారు కూడా ఏంచేస్తున్నారో అర్థం కావడం లేదని చెప్పారు. హై కమాండ్ మీద నమ్మకం వుందంటూ కాలం గడిపేస్తున్నట్లు కనిస్తుందన్నారు. తెలంగాణ అంశాన్ని పార్లమెంటు వరకు బలంగా తీసుకెళ్లిన ఆ ప్రాంత ఎంపీల మాదిరిగానే ప్రత్యేక హోదా కోసం మన ఎంపీలు కూడా ఉద్యమిచాలని పవన్ సూచించారు.
తెలంగాణ ఎంపీ రాష్ట్రం కోసం పాటు పడినట్లుగా.. సీమాంద్ర ఎంపీలు ప్రత్యేక హోదా అంశం బలంగా పార్లమెంటుకు తీసుకెళ్లలేకపోతున్నారని దుయ్యబట్టారు. దీని వల్ల ఎంత మంది విద్యార్థులు, నిరుద్యోగులు ఇబ్బందులు పడతారో..? ఎంత మంది ఆత్మహత్యలకు వీరు కారణం అవుతారో అని భయాందోళన వ్యక్తం చేశారు. ప్రత్యేక హెదా కోసం కేంద్ర మంత్రులు అశోక గజపతి రాజు ఎం చేస్తున్నారని ప్రశ్నించారు. ఎంపీలు కేంద్రమంత్రులు వారి వ్యాపారాలు, వ్యవహారాలు చక్కబెటుకునేందుకే హోదాపై మాట్టాడటం లేదని అన్నారు. మీ రాష్ట్రంకోసం మీరు పనిచేయవలసింది పోయి మీ వ్యాపారాలకోసమే పనిచేసుకుంటే ఆంధ్రకు ఎక్కువ అన్యాయం చేసేది మీరే అవుతారని ఆయన హెచ్చరించారు. మీకు పనిచేయడం చేతకాకపోతే రాజకీయాలలో ఉండకండి అని కూడా ఆయన హితవు చెప్పారు. లేదా అవే ముఖ్యమంటే పదవులకు రాజీనామా చేయాలని పవన్ డిమాండ్ చేశారు.
జి. మనోహర్
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more