టైటిట్ చదవగానే జగన్ కు ఏపిలో మంచి సీట్లే వచ్చాయి కదా మరి ఎందుకు పార్టీని మూసేస్తారు..? అయినా పార్టీ తీసేసిన తర్వాత ఏం చేసుకుంటారు..? ఇలా ప్రశ్నలు వస్తున్నాయేమో కానీ వాటికి పుల్ స్టాప్ పెట్టండి. ఎందుకంటే మొత్తం వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గురించి కాదు మేం చెబుతున్నది.. కేవలం ఒక జిల్లాకు చెందిన విషాయాన్ని మాత్రమే చెబుతున్నాం. అది కూడా నెల్లూరుకు సంబందించిన వార్త. అయితే తాజాగా నెల్లూరు జిల్లా వైసీపీ కార్యాలయంలోని అన్ని సామాన్లతో సహా ఖాళీ చేయడం వార్తల్లో నిలుస్తోంది. అయితే అసలు విషయం ఏంటంటే పార్టీ కార్యాలయానికి కూడా అద్దె కట్టలేని పరిస్థితి కాబట్టే ఖాళీ చేస్తున్నట్లు వైసీపీ నేతలు వెల్లడించారు. అయితే ఎడారిలో ఇసుక కరువా.. సముద్రంలో నీళ్లు కరువా అన్నట్లు జగన్ పార్టీకి నిధులు కరువా అనే ప్రశ్న వస్తోంది.
తాజాగా నెల్లూరు జిల్లా వైసీపీ కార్యాలయం ఖాళీ అయ్యింది. పార్టీ జిల్లా అధ్యక్షుడు నల్లపరెడ్డి ప్రసన్నకుమార్రెడ్డి ఆ పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రచారం సాగుతున్న నేపథ్యంలో పార్టీ కార్యాలయం ఖాళీ చేయడం చర్చనీయాంశమైంది. పార్టీ కార్యాలయ నిర్వహణ ఖర్చును ఆ పార్టీ అధ్యక్షుడు జగన్ భరిస్తామని మొదట హామీ ఇచ్చినా నిలుబెట్టుకోలేదు. జిల్లా పార్టీ కార్యాలయం నిర్వహిస్తున్న భవనానికి అద్దె రూ.40వేలు, సిబ్బంది, విద్యుత్ తదితర ఖర్చులన్నీ కలుపుకుంటే నెలకు రూ.1 లక్ష అవసరం ఉంది. జిల్లా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టేటప్పుడే ప్రసన్న తన ఆర్థిక పరిస్థితిని జగన్కు వివరించారు. ఆ సర్దుబాటు చేస్తామని జగన్ హామీ ఇవ్వడం, కొద్దిరోజులుగా అది కార్యరూపం దాల్చకపోవడంతో అద్దె చెల్లించలేని పరిస్థితి ఏర్పడినట్లు పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. ఇదే విషయాన్ని కొందరు పార్టీ నేతల దృష్టికి తీసుకుపోగా, ఇంటి యజమాని అవసరం ఉందని ఒత్తిడి చేయడంతో ఖాళీ చేసినట్లు పేర్కొన్నారు. మొత్తానికి వైసీపీ నెల్లూరు కార్యాలయం ఖాళీ అయ్యింది.
*అభినవచారి*
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more