ఓటుకు నోటు కేసు సరికొత్త మలుపులు తిరుగుతోంది. ఈ కేసులో ఇప్పటిదాకా మౌనం పాటించిన ఎన్నికల కమిషన్ రంగ ప్రవేశం చేసింది. ఎసీబీ ప్రత్యేక న్యాయస్థానానికి ఫోరెన్సిక్ సైన్స్ లేబోరేటరీ ఇచ్చిన ఆడియో, వీడియో టేపులను, నివేదికను తమకు కూడా అందజేయాలని ఎన్నికల కమిషన్ ఏసీబీ ప్రత్యేక కోర్టుస్థానాన్ని కొరడంతో ఈ కేసు కొత్త మలుపు తిరిగినట్లయ్యింది. దీన్ని బట్టి చూస్తుంటే నేరుగా కేంద్ర ఎన్నికల కమిషన్ ఓటుకు నోటు వ్యవహారాన్ని తామే దర్యాప్తు చేయాలన్న ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.ఇందులో భాగంగానే నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్ సన్తో తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి జరిపిన బేరసారాలకు సంబంధించిన వీడియో టేపులను, ఆడియోలను తమకు కూడా ఇవ్వాలని పిటిషన్ దాఖలు చేసినట్లు తెలుస్తోంది. ఈ కేసుకు సంబంధించి ఎప్పటికప్పుడు తమకు సమాచారం అందుతూనే ఉందని, ఈ వ్యవహారంలో ఆధారాల కోసం జూన్ 1న ఎన్నికల కమిషన్ తరపున పిటిషన్ను దాఖలు చేశామని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ భన్వర్లాల్ చెప్పారు. తాజాగా రిమైండర్ వేశామన్నారు. ఈ కేసులో ఎప్పటికప్పుడు తనకు అందుతున్న సమాచారాన్ని కేంద్ర ఎన్నికల సంఘానికి చేరవేస్తూనే ఉన్నామని ఆయన పేర్కొన్నారు.
ఏసీబీ కోర్టులో ఉన్న ఈ కేసు తుది తీర్పు వచ్చాకే ఏం చేయాలో భవిష్యత్తులో నిర్ణయం తీసుకుంటామని భన్వర్ లాల్ ప్రకటించారు. ఎన్నికల కోడ్ అమల్లో ఉండగా ఎన్నికల కోసం తరలించే డబ్బును పట్టుకునే అధికారం కేవలం ఎన్నికల కమీషన్కే ఉందని ఒకవేళ పోలీసులు వాహనాలను లేదా నాయకుల నివాసాలపై దాడి చేసి అక్రమంగా దాచి ఉన్న డబ్బును పట్టుకున్నట్లైతే ఆ మొత్తాలను ఎన్నికల రిటర్నింగ్ అధికారికి లేదా ఎన్నికల సంఘానికి అప్పగించవలసి ఉంటుందని అయితే ఓటుకు నోటు కేసులో రేవంత్ రెడ్డి వ్యవహారాన్ని అవినీతి నిరోధక శాఖ వలపన్ని ఎలా పట్టుకుంటుందని ఏసీబీని ఏర్పాటు చేసింది అవినీతి, లంచగొండి అధికారులను, సిబ్భందిని పట్టుకోవాలే తప్ప రాజకీయ నేతలతో వారికి ఎటువంటి సంబంధం లేదన్న వాదనలు వినిపిస్తున్నాయి. ఈ నేపధ్యంలో ఈ కేసును ఎన్నికల సంఘం స్వీకరించి తద్వారా మొత్తం వ్యవహారాన్ని దర్యాప్తు చేయాలన్న ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. మరి ఓటుకు నోటు కేసులో ముందు ముందు ఎలాంటి పరిణామాలు చోటుచేసుకుంటాయో వేచిచూడాలి.
*అభినవచారి*
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more