మత్తయ్య.. ఓటుకు వ్యవహారంలో నాలుగో నిందితుడిగా, కేసీఆర్ మీద కేసు పెట్టిన వ్యక్తిగా జెరూసలెం మత్తయ్య వార్తల్లో నిలిచారు. అయితే ఓటుకు నోటు వ్యవహారంలో తెలంగాణ పోలీసులు మత్తయ్య కోసం గాలింపులు చర్యలు చేపట్టినా ఎలాంటి లాభం లేకుండాపోయింది. ఇప్పటి వరకు కూడా మత్తయ్యను పోలీసులు పట్టుకోలేకపోయారు. నిజానికి మత్తయ్యను పట్టుకోవడానికి పోలీసులు గట్టిగా ప్రయత్నించలేదని పుకారు వినిపిస్తోంది. అయితే తెలంగాణలో కనిపించడని మత్తయ్య ఉన్నట్లుండి సీమాంధ్రలో కనిపించారు. సత్యనారాయణపురం పోలీస్ స్టేషన్ లో కేసీఆర్ మీద, తనకు ప్రాణహాని ఉందని కూడా పోలీసులకు ఫిర్యాదు చేశారు. దాంతో ఏపి ప్రభుత్వం మత్తయ్య ఫిర్యాదును సీరియస్ గా తీసుకున్నారు. ఎందుకంటే ఓటుకు నోటు కేసుతో తెలంగాణ సర్కార్ దూకుడు పెంచితే ఏపి ప్రభుత్వం మత్తయ్య ఫిర్యాదుతో దూకుడుకు సిద్దమైంది.
అయితే తెలంగాణ పోలీసులకు కనిపించకుండా తిరిగుతున్న మత్తయ్య ఎక్కడా అని ఆరా తీస్తే మాత్రం వివరాలు లేవు. అయితే ఓటుకు నోటు వ్యవహారంలో మత్తయ్యను అదుపులోకి తీసుకోవడానికి పోలీసులు అన్ని ప్రయత్నాలు చేస్తున్నా కానీ ఫలించడం లేదు. అయితే నేను ఇక్కడున్నానండీ బాబూ అంటూ మత్తయ్య తను ఉంటున్న అడ్రస్ పై వివరణ ఇచ్చుకున్నారు. తాను ఏపి మంత్రుల సంరక్షలో ఉన్నానని వస్తున్న వార్తల్లో ఎలాంటి వాస్తవం లేదని తెలిపారు. తన బార్య స్వస్థలం గుంటూరులోని అత్తగారింట్లో ఉంటున్నానని జెరూసలేం మత్తయ్య స్పష్టం చేశారు. మొత్తానికి తాను తన అత్తగారింట్లో ఉన్నానని తెలిపారు మత్తయ్య.
*అభినవచారి*
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more