క్రికెట్ చరిత్రలో కలకాలం నిలిచే లెజెండరీ పేరు సచిన్ టెండూల్కర్. అయితే నిన్నటిదాకా సచిన్ క్రికెటర్ గా తెలుసు కానీ ఇప్పుడు మాత్రం క్రికెటర్ తో పాటు రెండెకరాల ఆసామీగా కూడా మారారు. క్రికెట్ ప్రపంచాన్ని ఒంటిచేత్తో ఏలిన ఆ సచిన్ టెండూల్కరే ఇప్పుడు రైతుగా మారారు. పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా, తడ మండలం, కాదలూరు గ్రామానికి చెందిన వి. మునికృష్ణయ్యకు సర్వే నెం.263/2 (బీ)లో రెండెకరాల పట్టాభూమి ఉండేది. దీన్ని 2006లో సచిన్ టెండూల్కర్కు అమ్మినట్లుగా వార్తలొచ్చాయి. అయితే దీన్ని ఎవరూ పెద్దగా పట్టించుకోలేదు. అయితే, తాజాగా ఆ భూమికి పట్టాదారు పాసుపుస్తకం మంజూరు చేయాలని కోరుతూ ‘మీసేవ’ద్వారా సచిన్ అర్జీ పెట్టుకున్నారు. దీన్ని పరిశీలించిన రెవెన్యూ అధికారులు ఆ రెండెకరాలు సచిన్కు చెందినదిగా నిర్ధారించారు. ఈ భూమికి పట్టా నెంబరు 456, పట్టాదారు పాసుపుస్తకం 09వై 46ఎస్ 005000008 నెంబర్లను కేటాయిస్తూ ఆన్లైన్ పాసుపుస్తకం జారీ అయింది. అయితే.. పట్టాదారు పాసుపుస్తకం ముద్రణకు చెన్నై పంపించినందున అక్కడినుంచి రాగానే.. సచిన్కు అందజేయనున్నట్లు తహసీల్దార్ తెలిపారు.
పార్లమెంట్ సభ్యులు ఓ గ్రామాన్ని దత్తత తీసుకోవాలని ప్రధాని నరేంద్రమోదీ ఇచ్చిన పిలుపుమేరకు పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలోని కండ్రిగ గ్రామాన్ని దత్తత తీసుకున్నారు. దాంతో నిన్నటి దాకా కనీసం పేరు కూడా తెలియని కండ్రిగ గ్రామం పేరు వార్తలకెక్కింది. ప్రతి పార్లమెంటరీ సభ్యుడు దేశంలోని ఏదో ఒక గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దాలని కొత్తగా స్కీంను ప్రవేశపెట్టారు. దాంతో సచిన్ టెండూల్కర్ నెల్లూరు జిల్లాలోని ఓ గ్రామాన్ని దత్తత తీసుకున్నారు. అయితే క్రికెట్ రంగంలో దిగ్గజంగా పేరుగాంచిన సచిన్ తాజాగా ఆసామీగా మారారు. కాగా సచిన్ కుటుంబ సభ్యులకు కూడా తడ మండలంలోనే పలుచోట్ల దాదాపు 10 ఎకరాల భూములున్నాయని అధికారులంటున్నారు. అయితే వాటికి సంబంధించి పట్టాదారు పాస్పుస్తకాల కోసం అర్జీలు అందలేదని తెలిసింది.
*అభినవచారి*
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more