అది ఓ గ్రామం కానీ గ్రామంలోలాగా ఎవరూ వెనుకబడి ఉండరు. అయితే వెనకబడలేదు కదాని ఏదో మధ్యస్తంగా ఉన్నారనుకుంటే పొరపాటే. ఆసియాలోనే ధనిక గ్రామంగా మారింది ఆ గ్రామం. అవును ఆ గ్రామం పేరు ఏంటో తెలుసా..? మాధాపూర్. పేరు వినగానే హైదరాబాద్ మాదా పూర్ అనుకుంటున్నారేమో కానీ కాదు గుజరాత్ లోని మాధా పూర్ గురించి మాట్లాడుతున్నాం. అక్కడి గ్రామస్తుల జనాభా 1500 మాత్రమే. కానీ ఆ గ్రామం వాళ్ల ఫిక్స్ డిపాజిట్లు 1800కోట్లు. అవును మీరు చదివిన నెంబర్ కరెక్టే. పదిహేను వందల మంది జనాభా కలిసి బ్యాంకుల్లో ఫిక్స్ చేసిన డిపాజిట్స్ పద్దెనిమిది వందల కోట్లు. యావరేజ్ గా తలా పన్నెండు లక్షల రూపాయల డిపాజిట్ మెంటెన్ చేస్తున్నారంటే ఆ గ్రామస్తులు ఎంత ధనవంతులో అర్థం చేసుకోవచ్చు. దేశంలోనే కాదు ఆసియాలోనే ధనిక గ్రామంగా మాధాపూర్ కు తాజాగా గుర్తింపు లభించడంతో వార్తల్లో నిలిచింది. మీడియాలో మాధాపూర్ మీద కథనాలు వస్తుండటంతో అందరూ ఆ గ్రామం గురించి మరిన్ని విషయాలను తెలుసుకుందేకు ఉత్సాహం చూపుతున్నారు. మాదాపూర్ స్టోరీ ఏంటో తెలియాలంటే మొత్తం ఆర్టికల్ చదవాల్సిందే..
గుజరాత్ లోని భూజ్ కు దగ్గరలో మాధాపూర్ గ్రామం ఉంది. మొత్తం జనాభా పదిహేను వందలు. అయితే చాలా మంది గ్రామస్తులు ఫారెన్ కంట్రీస్ లో జాబ్ చేస్తుంటారు. ఆఫ్రికా, యుఎస్, యుకె, గల్ఫ్ దేశాల్లో బిల్లింగ్ కాంట్రాక్టర్ లుగా ఉంటున్నారు. అయితే గ్రామంలో దాదాపుగా ఎక్కువ మంది పటేల్ వర్గానికి చెందిన వారు. అయితే అక్కడ సంపాదించిన మొత్తాలను మన దేశంలోని బ్యాంకుల్లో జమ చేస్తూ... అక్కడి నుండి వచ్చిన వారు ఇక్కడ బడా బిల్డర్ లుగా మారుతున్నారు. గ్రామంలోని 1500 మంది కలిసి మొత్తం బ్యాంకుల్లో జమ చేసిన నగదు దాదాపు పదిహేను వందలకోట్ల రూపాయాలు అంటే ఆశ్చర్యపోనక్కర్లేదు. మాధాపూర్ గ్రామస్తుల సగటు 12 లక్షల రూపాయల నగదు బ్యాంకులో డిపాజిట్ గా ఉంది అంటే ఎంత ధనికులో అర్థం చేసుకోవచ్చు.
*అభినవచారి*
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more