ఓటుకు నోటు వ్యవహారంలో పరిణామాలు వేగంగా మారుతున్నాయి. అటు ఏపి ప్రభుత్వం, ఇటు తెలంగాణ ప్రభుత్వం ఈ విషయంపై తర్జన భర్జలు చేస్తున్నాయి. రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, డిజిపిలు, ముఖ్య పోలీస్ అధికారులు భేటీ అవుతుండటంతో రాజకీయ వాతావరణం వేడెక్కుతోంది. హైదరాబాద్ లో ప్రస్తుతం వాతావరణం కూల్ గా ఉన్నా కానీ రాజకీయ వాతావరణం మాత్రం వేడిగా మారింది. రెండు రాష్ట్రాలకు చెందిన కీలక వ్యక్తులు, అధికారులు వరుస భేటీలతో వాతావరణాన్ని వేడెక్కించారు. అయితే తెలంగాణ ముఖ్యమంత్రిలో తెలంగాణ డిజిపి, ఏసీబీ డిజి, సిపి మహేందర్ రెడ్డిలు భేటీ అయ్యారు. అటు మరోపక్క ఏపి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో ఏపి డిజిపి, ఏసీబీ డిజి భేటీ అయ్యారు. తాజా పరిణామాలపై చర్చించారు.
అయితే ఏపీ ప్రభుత్వం కూడా తెలంగాణ సర్కార్ కు ధీటుగా జవాబివ్వాలని నిర్ణయించిన నేపథ్యంలో తెలంగాణ సర్కార్ వ్యూహాలపై చర్చించింది. తెలంగాణ సిఎం కేసీఆర్ తో భేటీ అయ్యారు. తెలంగాణ డిజిపి, ఏసీబీ డిజిలు తర్వాత తీసుకునే చర్యల గురించి చర్చించారు. అయితే తాజాగా ఓటుకు నోటు కేసులో దాదాపు 21 మందికి లుకౌట్ నోటీసులు ఇవ్వనున్నారని వార్తలు వస్తున్నాయి. ఈ కేసులో ప్రమేయం ఉన్న పలువురు అనుమానితులు దేశం వదిలి పారిపోకుండా ముందస్తుగా లుకౌట్ నోటీసులు జారీ చేయాలని నిర్ణయించారని తెలుస్తోంది. ఈ రోజే లుకౌట్ నోటీసులను జారీ చేయవచ్చని చెబుతున్నారు. ఇంతమంది పైన ఎల్ఓసీ జారీ చేయడం ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నసమయంలోను ఎప్పుడు జరగలేదు. మరి ఏం జరుగుతుందో చూడాలి.
*అభినవచారి*
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more