తెలుగు రాష్ట్రం రెండు రాష్ట్రాలుగా విడిపోయే ముందు హైదరబాద్ ను ఉమ్మడి రాజధానిగా చేసింది కేంద్ర ప్రభుత్వం. రెండు రాష్ట్రాలు హైదరాబాద్ కేంద్రంగానే పదేళ్లపాటు పరిపాలన తదితరరాలను చూసుకునేందుకు అవకాశం కల్పించింది. అయితే తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తర్వాత దాదాపు అన్ని అంశాలను తెలంగాణ ప్రభుత్వమే టేకోవర్ చేస్తోంది. అయితే గత పదిహేను రోజులుగా సాగుతున్న రాజకీయ పరిణామాల కారణంగా హైదరాబాద్ లో ఏపి పోలీసులకు మోహరించింది ఏపి ప్రభుత్వం. అవసరమైతే హఐదరాబాద్ లో ఏపి పోలీస్ట్ స్టేషన్లు కూడా ఏర్పాటు చేస్తామని ఏపి మంత్రులు ప్రకటించారు. అయితే హైదరాబాద్ లో ఉంటున్న తమకు రక్షణ లేదని సీమాంధ్రులు అనుకుంటున్నారని అందుకే వారి రక్షణకు ఏపి నుండి పోలీసులను రప్పించినట్లు తెలుస్తోంది. అయితే రెండు రోజులు క్రితం హైదరాబాద్ తెలంగాణ భూభాగంలోనిదని, ఏపిలో బాగం కాదని అలాంటప్పుడు ఏపి పోలీసులును ఎలా ఉ:చుతారని తెలంగాణ డిజిపి గవర్నర్ కు ఫిర్యాదు చేశారు.
అయితే అనూహ్య పరిణామాల మధ్య ఏపి పోలీసుల్లో 400 మందిని తిరిగి తమ స్వంత రాష్ట్రానికి .పిలుపిస్తు ఏపి డిజిపి రాయుడు నిర్ణయం తీసుకున్నారు. అయితే హైదరాబాద్ లోని పోలీసుల వ్యవహారం కాబట్టి గవర్నర్ కు ముందుగానే సమాచారమిచ్చారు ఏపి డిజిపి. అయితే ప్రస్తుతం ఉన్న ఏపి పోలీసుల్లో కేవలం 400 మందిని మాత్రమే తిరిగి పిలిపించారు. ఏపి అసెంబ్లీ, సచివాలయం, ఎన్డీఆర్ ట్రస్టు భవన్ లతో పాటు కీలక ప్రదేశాల్లో ఏపి పోలీసుల పహారా కొనసాగుతోంది. అయితే ఉన్నట్లుండి ఏపి పోలీసులను ఎందుకు తిరిగి రప్పించారన్నది ఆసక్తిగా మారింది. అయితే కేంద్ర హోం మంత్రిత్వ శాఖ నేరుగా హైదరాబాద్ పై ప్రత్యేక దృష్టిసారిస్తోందని అందుకే హైదరాబాద్ లో ఏపి పోలీసుల అవసరం లేదని ఏపి పోలీస్ బాస్ ఆలోచించినట్లు కొంత మంది అనుకుంటున్నారు.అయితే దీనిపై క్లారిటీ రావాలంటే ఏపి డిజిపి రాయుడు లేదంటే ఏపి ముఖ్యమంత్రి కానీ క్లారిటీ ఇవ్వాల్పిందే.
*అభినవచారి*
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more