తెలుగు రాష్ట్రాల్లో సెగ పుడుతోంది. తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా బయటపడ్డ ఓటుకు నోటు వ్యవహారం కాస్తా.. చిలికి చిలికి గాలి వానగా మారింది. ఓటుకు నోటు వ్యవహారం కాస్తా రెండు రాష్ట్రాల మధ్య వివాదంగా మారింది. హైదరాబాద్ లొ తమకు రక్షణ లేదని కాబట్టి సెక్షన్ -8 అమలు చెయ్యాలని ఏపి ప్రభుత్వం పట్టుబడుతోంది. అయితే సెక్షన్ 8 కు ఎట్టి పరిస్థితిలోనూ ఒప్పుకునేది లేదని తెలంగాణ సర్కార్ తేల్చిచెప్పింది. అయితే తెలంగాణ సర్కార్ దూకుడుకు కళ్లెం వెయ్యాలని ఏపి ప్రభుత్వం అన్ని రకాల ప్రయత్నాలు చేస్తోంది. అందులో భాగంగానే ఢీ అంటే ఢీ అంటూ సవాల్ విసురుతోంది. అయితే రానున్న 24 గంటల్లో తెలంగాణ సర్కార్ కు షాక్ ఇస్తామంటూ ఏపి ప్రభుత్వం తరఫున హెచ్చరికలు జారీ అయ్యాయి. అయితే ఏపి ప్రభుత్వం చేసిన హెచ్చరికల తర్వాత తెలంగాణ సర్కార్ మరింత స్పీడ్ పెంచింది. ఓటుకు నోటు కేసులో వేం నరేందర్ రెడ్డికి నోటీసులు ఇవ్వడంతో పాటు, సండ్ర వీరయ్యను వాంగ్మూలం ఇవ్వాల్సిందిగా కోరింది. అయితే ఏపి ప్రభుత్వం అంటున్నట్లు రానున్న 24 గంటల్లో ఏం జరుగుతుందన్నది ఆసక్తి రేపుతోంది.
తెలంగాణ ప్రభుత్వం ఏపి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో సహా, మంత్రులు, కీలక నేతల ఫోన్లను ట్యాప్ చేసిందని ఏపి ప్రభుత్వం ఆరోపిస్తోంది. అయితే ఇదివరకే దీనిపై కేంద్రానికి ఫిర్యాదు చేసింది ఏపి ప్రభుత్వం. అయితే కేంద్రం పెద్దగా ఇన్వాల్వ్ కాకపోవడంతో నేరుగా తెలంగాణ ప్రభుత్వానికి బదులివ్వాలని ఏపి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అయితే ట్యాపింగ్ వ్యవహారంలో ఇద్దరు ఐపియస్ లు, ఒక ఐఎఎస్, మరో ఇద్దరు కీలక వ్యక్తుల వివరాలు 24 గంటల్లో చెబుతామని ఏపి ప్రభుత్వం తెలిపింది. దాంతో ట్యాపింగ్, ఓటుకు నోటు వివాదం కొత్త మలుపు తిరిగింది. రానున్న 24 గంటల్లో రెండు రాష్ట్రాల మధ్య ఏం జరగబోతోంది అని సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. అయితే మరోపక్క రెండు రాష్ట్రాల మధ్య సయోధ్య కుదర్చడానికి కేంద్రం తరఫున కేంద్ర హోంమంత్రిత్వ శాఖ కార్యదర్శితో కూడిన బృందం ఒకటి హైదరాబాద్ కు రానుంది. అయితే ఈ 24 గంటల్లో ఏం జరుగుతోంది అని అటు మీడియా వాళ్లు, తెలుగు వారు ఎదురుచూస్తున్నారు.
*అభినవచారి*
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more