యూపీలో జర్నలిస్టు జగేంద్రసింగ్ దారుణ హత్యను మరచిపోకముందే మరో జర్నలిస్టుపై హత్యాయత్నం జరిగింది. పిలిభిత్లో ఓ భూ కబ్జా కేసును హైలైట్ చేసిన హైదర్ఖాన్ అనే టీవీ రిపోర్టర్ దుండగుల కిరాతకానికి గురయ్యాడు. దుండగులు అతన్ని బైక్కి కట్టేసి లాక్కుపోవడంతో తీవ్ర గాయాలకు గురై సృహ కోల్పోయాడు. ఖాన్ ఓ న్యూస్ ఛానెల్కు స్ర్టింగర్గా పనిచేస్తున్నాడు. యాక్సిడెంట్లో దొంగ ఒకడు గాయపడ్డాడని అతనికి ఈనెల 13న సమాచారం అందడంతో వివరాలు తెలుసుకునేందుకు ఖాన్ బిల్హరి గ్రామానికి వెళ్లాడు. అయితే అక్కడ అరవింద్ ప్రకాష్ అనే గూండా తన అనుచరులతో ఖాన్ను మోటారు సైకిల్కు కట్టేసి లాక్కువెళ్లాడు. గాయపడిన ఖాన్ను వదిలేసి పరారైయ్యాడు.
ప్రాణాపాయస్థితిలో ఉన్న బాధితుడ్ని కొందరు రక్షించి పిలిభిత్లోని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. దృష్టిలోపంతో బాధపడుతున్న తన సోదరుడికి చెందిన ఆరు ఎకరాల వ్యవసాయ భూమిని అరవింద్ ప్రకాష్ కబ్జా చేశాడని ఖాన్ రిపోర్టు చేయడంతో అతనిపై అరవింద్ కక్ష గట్టాడు. ఆ భూమిని తనపేరిట బదిలీ చేయాల్సిందిగా కోరుతూ ఆ గూండా కొన్నిరోజులక్రితం తన తండ్రిని తీవ్రంగా కొట్టాడని, దీన్ని తాను బయటపెట్టడంతో అరవింద్ తనపై హత్యాయత్నం చేశాడని హైదర్ఖాన్ అంటున్నాడు. కాగా అరవింద్ ప్రకాష్పైన, అతని కొడుకుతోసహా మరో ఇద్దరిపైన కేసు నమోదు చేశామని, వారికోసం గాలిస్తున్నామని పోలీసులు తెలిపారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more