తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ప్రస్తుతం జైలులో ఉన్న తెలంగాణ తెలుగుదేశం పార్టీ కీలక నేత రేవంత్ రెడ్డి ఇంట్లో జరుగనున్నమొదటి శుభకార్యానికి హాజరుకావాలని అనుకుంటున్నారని సమాచారం. తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు తన కుటుంబ సభ్యుులతో పాటుగా, ఏపి మంత్రులు, తెలంగాణ నేతలు అందరూ రేవంత్ రెడ్డి కూతురి నిశ్చితార్థానికి హాజరుకావాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. తెలంగాణలో ఎంతో కీలకంగా మారిన రేవంత్ రెడ్డి కుటుంబానికి ఇలాంటి సమయంలో ఖచ్చితంగా అండగా ఉండాలని చంద్రబాబు నాయుడు ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. అలాగే రేవంత్ రెడ్డి వ్యవహారంతో అటు తెలంగాణ, ఇటు ఏపి నేతలను ఒక్కచోటికి చేర్చి భవిష్యత్ ప్రణాళికలు కూడా రేవంత్ ఇంటి నుండే ప్లాన్ చేస్తారని కూడా సమాచారం.
నారా చంద్రబాబు నాయుడు, సతీమణి భువనేశ్వరి, కొడుకు నారా లోకేష్ లతో పాటుగా ఏపి మంత్రులు నారాయణ, అచ్చెన్నాయుడు, చిన్నరాజప్పలతో సహా మొత్తం ఏపి కేబినెట్ లోని మంత్రులు, కీలకనేతలు అలాగే తెలంగాణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు ఎల్. రమణ, ఎర్రబెల్లి దయాకర్ రావ్, మోత్కుపల్లితో తెలంగాణ తెలుగుదేశం క్యాటడర్ రేవంత్ రెడ్డి కూతురి నిశ్చితార్థానికి హాజరు కావాలని చంద్రబాబు సూచించినట్లు తెలుస్తోంది. మొత్తానికి రేపు కోర్టులో రేవంత్ రెడ్డి బెయిల్ పిటిషన్ హియరింగ్ ఉండగా ఒకవేళ బెయిల్ దొరికినా.. దొరకకపోయినా కానీ రేవంత్ రెడ్డి ఇంట్లో చేస్తున్న మొదటి శుభకార్యం కావడంతో ఎట్టి పరిస్థితుల్లోనూ వాయిదా వెయ్యకూడదని రేవంత్ రెడ్డి కుటుంబ సభ్యులు నిర్ణయించారట. మొత్తానికి రేవంత్ రెడ్డి ఇంటికి రేపు చంద్రబాబుతో సహా తెలుగుదేశం పార్టీ క్యాడర్ మొత్తం తరలివెళుతున్నట్లు దాదాపుగా ఫైనల్ అయినట్లు తెలుస్తోంది.
*అభినవచారి*
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more