ఆమ్ ఆద్మీ పార్టీకి నాయకుడు, ఢిల్లీ న్యాయశాఖ మంత్రిని ఇవాళ పోలీసులు అరెస్టు చేయడంపై ఆమ్ ఆద్మీ పార్టీ తీవ్ర వ్యాఖ్యలు చేసింది. సంపూర్ణ ప్రజా బలంతో వచ్చిన తమపై కేంద్రం ప్రభుత్వం, లెఫ్టినెంట్ గవర్నర్ నజీబ్ జంగ్, ఢిల్లీ పోలీస్ కమీషనర్ కలసి ఎమర్జెన్సీ లాంటి పరిస్థితిని తీసుకువస్తున్నారని ఆఫ్ అరోపించింది. కేంద్రం చేతిలో కీలుబోమ్మగా మారిన లెఫ్టినెంట్ గవర్నర్, ఢిల్లీ పోలిస్ కమీషనర్ కలసి తమ ప్రభుత్వాన్ని కూలదోయాలని యత్నిస్తున్నారని, తమ మంత్రులను, ఎమ్మెల్యేలను భయకంపితుల్ని చేస్తున్నారని ఆఫ్ అరోపించింది. తమ ప్రభుత్వానికి చెందిన మంత్రిని అరెస్టు చేసే క్రమంలో ఢిల్లీ పోలీసులు తమ శాసనసభాపతి అనుమతి ఎందుకు తీసుకోలేదని అప్ ప్రశ్నించింది. అరెస్టు చేసే క్రమంలో తమ అమాత్యుడిపై ఢిల్లీ పోలీసులు చేయి కూడా చేసుకున్నారని ఆప్ అరోపించింది.
నకిలీ సర్టిఫికెట్లతో న్యాయవాదిగా చలామణి అవుతున్న కేసులో మంత్రి జితేంద్రసింగ్ తోమర్ను అరెస్టు చేసిన పోలీసులు ఇవే అభియోగాలను ఎదుర్కోంటున్న కేంద్ర మానవవనరుల శాఖ మంత్రి స్మృతి ఇరానీ సహా రామ్ శంకర్ కఠారియాను కూడా పార్లమెంటు అనుమతి లేకుండా అరెస్టు చేయగలరా అని అప్ నేతలు ప్రశ్నలు కురిపిస్తున్నారు. ఢిల్లీలో ప్రజాబలంతో గెలిచిన తమపై.. కక్షగట్టిన కేంద్ర ప్రభుత్వం అనవసర రాద్దాంతాలతో ప్రజలకు ఎలాంటి మంచి పనులు చేయనీయకుండా అడ్డుకుంటోందని అప్ నేతలు ఆరోపించారు. మంత్రిగా తోమర్ తాను ముందుగా నిశ్చయించుకున్న కార్యక్రమానికి వెళ్తుండగా పోలీసులు మార్గమధ్యంలో అతడిని అరెస్టు చేసిన వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారని ఆప్ అరోపించింది.
కాగా, ఢిల్లీ పోలీసులు మాత్రం శాసనసభాధిపతికి తాము తోమర్ అరెస్టు గురించి తెలియజేశామని చెబుతున్నారు. ఢిల్లీ స్పీకర్ కు తాము తోమర్ అరెస్టు విషయాన్ని ఫ్యాక్స్ ద్వారా తెలియజేశామని అంటున్నారు. అయితే అందుకు స్పీకర్ నుంచి అనుమతి లభించిందా అన్న ప్రశ్నలను మాత్రం ఢిల్లీ పోలీసులు దాటవేస్తున్నారు. తాము లెఫ్టినెంట్ గవర్నర్ అడుగుజాడల్లో నడుచుకోవడం లేదని, ఢిల్లీ ప్రభుత్వాన్ని, మంత్రులను భయకంపితుల్ని చేయాల్సిన అవసరం కూడా తమకు లేదని చెబుతున్నారు.
జి.మనోహర్
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more