తెలుగుదేశం పార్టీ తెలంగాణ నేత, పార్టీ ఫైర్ బ్రాండ్ రేవంత్ రెడ్డి అరెస్టుతో తెలుగు రాష్ట్రాల్లో అలజడి రేగింది. అయితే తమ నేతను అన్యాయంగా అరెస్టు చెయ్యడంపై రేవంత్ రెడ్డి అభిమానులు ఒక్కసారిగా మండిపడ్డారు. అయితే గత కొంత కాలంగా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మీద మాటల తూటాలు పేలుస్తున్నరేవంత్ రెడ్డిని అరెస్టు చెయ్యడంతో తెలుగు రాష్ట్రాల్లో వేడిరాజుకుంది. అయితే రేవంత్ రెడ్డి ప్రాణానికి హాని ఉందంటూ అతని తమ్ముడు కొండల్ రెడ్డి ఏసీబీ కార్యాలయానికి వెళ్లి ఆందోళన చేశారు. తెలంగాణ ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నాడనే కోపంతో తన అన్నను చంపాలని చూస్తున్నారని రేవంత్ తమ్ముడ కొండల్ రెడ్డి ఆరోపించారు. దాంతో రేవంత్ రెడ్డి ప్రాణానికి నిజంగా హాని ఉందా.. ఎవరైనా రేవంత్ రెడ్డిని టార్గెట్ చేశారా..? అన్న అనుమానాలు తలెత్తాయి.
తాజాగా ఏసీబీ అధికారులు తమ కస్టడీకి రేవంత్ రెడ్డిని అప్పగించాలంటూ కోర్ట్ లో వాదించింది ఏసీబీ. అయితే రేవంత్ తరఫు లాయర్ మాత్రం ఏసీబీ కస్టడీకి ససేమీరా అంటున్నారు. రేవంత్ రెడ్డి ప్రాణానికి ముప్పు ఉంది అని లాయర్ వాదించారు. గత కొంత కాలంగా రేవంత్ రెడ్డిని టార్గెట్ చేస్తూ మంత్రులు, ముఖ్యనేతలు చేస్తున్న స్టేట్మెంట్లు ఇందుకు నిదర్శనం అని లాయర్ వాదించారు. అయితే ఓటుకు నోటు స్కాంలో అరెస్టు చేసిన రేవంత్ రెడ్డిని పూర్తిగా విచారించడానికి ఐదు రోజులు తమ కస్టడీకి అప్పగించాలని ఏసీబీ అధికారులు కోర్టును కోరారు. అయితే రేవంత్ కు ప్రాణహాని ఉంది అని లాయర్ వాదించారు. అయితే ప్రాణహాని ఉంది అంటున్న రేవంత్ కు ఎవరి వల్ల ప్రాణ హాని ఉంది..? పోలీసుల కస్టడీలో ఉన్నా కూడా ఎలాంటి ముప్పు ఉంది.? ప్రాణహాని ఉంది అని గతంలో ఎక్కడైనా చెప్పారా..? కనీసం అనుమానాలు ఏమైనా ఉన్నాయా..? ఇలా ప్రశ్నలకు రేవంత్ రెడ్డి, అతని లాయర్లే సమాధానాలు ఇవ్వాలి.
*అభినవచారి*
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more