కింద దగా, పూన దగా, కుడి ఎడమల దగా దగా అన్న శ్రీ శ్రీ వ్యాఖ్యలను తూచా తప్పకుండా పాటిస్తున్నారు ఓ పెట్రోల్ బంకు యాజమాన్యం వారు. అందుకేనేమో.. ఏకంగా 72 వేల లీటర్ల కిరోసిన్ ను సిద్దం చేశారు. వాటిలో కోండ పెట్రోల్, డిజిల్ లో కలపనుండగా, మరికోంత కల్తీ చేసి దారిద్ర్య రేఖకు దిగువన వున్న పేదలకు విక్రయించేందుకు సిద్దం చేశారు. అయితే ఈ విషయమై పిర్యాదులు వెల్లువెత్తుతుండటంతో రంగంలోకి దిగిన మధ్యప్రదేశ్ పౌరసరఫరాలశాఖ మంత్రి కున్వారా విజయ్ షా, తనిఖీ బృందాలతో దాడులు నిర్వహించి దాదాపు 72 వేల లీటర్ల కిరోసిన్ పట్టుకున్నారు.
ఆ బంక్ యాజమాన్యానే కాదు మొత్తం జిల్లా పౌర సరఫరా అధికార యంత్రంగాన్నూ అవాక్కయ్యేలా చేశారు. ఆహార పౌర సరఫరాల శాఖ మంత్రిగా పనిచేస్తున్న విజయ్ షాకు గత కొంతకాలంగా పెట్రోల్ బంక్ వారు డీజిల్, పెట్రోల్లో బాగా కల్తీ చేస్తున్నారని, కిరోసిన్ కలుపుతున్నారని ఫిర్యాదులు వస్తున్నాయి. దీంతో పనిగట్టుకొని రంగంలోకి దిగిన ఆయన గుట్టుచప్పుడు కాకుండా సదరు పెట్రోల్ బంక్ పై అధికారుల బృందంతో ఆకస్మికంగా తనీఖీ చేసి షాక్ ఇచ్చారు. అక్కడే నెంబర్ ప్లేట్స్ లేని ఓ కంటెయినర్ మరో పెట్రోల్ ట్యాంకర్లను గుర్తించారు. పెట్రోల్ బంక్ వెనుక భాగంలో ఈ కిరోసిన నిల్వచేసి ఉంచినట్లు గుర్తించామని చెప్పారు. ఇందులో 40 వేల లీటర్లు బ్లూ కిరోసిన్, 32 వేల లీటర్లు తెల్ల కిరోసిన్ గుర్తించినట్లు తెలిపారు.
ఈ కిరోసిన్ ను చౌక ధరల దుకాణాలలో లభించే నీలిరంగు కిరోసిన్ ను రంగుమార్చి మార్కెట్లలో విక్రయానికి వుంచినట్లు మంత్రి తెలిపారు.
జి.మనోహర్
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more