విభజన జరిగి ఏడాదికావొస్తున్నా, ఏపీకి ప్రత్యేక హోదాపై ఇప్పటికీ స్పష్టత లేదు. స్పెషల్ స్టేటస్ పై నీళ్లు నములుతున్న కేంద్రం.. నిధులు మాత్రం ఎక్కువగానే కేటాయిస్తామని చెబుతోంది. కేంద్రం తీరుపై ఏపీలో తీవ్ర అసహనం వ్యకమవుతోంది. తాజాగా, ప్రత్యేక హోదాపై అరుణ్ జైట్లీ వ్యాఖ్యలతో.. ఏపీ మళ్లీ నిరసనలు మొదలయ్యాయి. ప్రత్యేక హోదా కోసం ఏడాది కాలంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఆత్రంగా ఎదురుచూస్తున్నారు. హామీని నేరవేర్చాల్సిన కేంద్ర ప్రభుత్వం మాత్రం జనం ఆవేదనను లైట్ తీసుకున్నట్లు కనిపిస్తోంది. స్పేషల్ స్టేటస్పై ఏపీ నేతలు ఎన్నిసార్లు మొరపెట్టుకుంటున్నా.. ఎస్ చెప్పడం లేదు. తాజాగా కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ కూడా, ప్రత్యేకహోదా లేనట్టేనని పరోక్షంగా తేల్చిచెప్పారు. ఇక వెంకయ్య నాయుడు విషయం అయితే మరీ విడ్డూరం. ఆయన ఏం మాట్లాడతారో క్లారిటీ ఇచ్చి మరీ కన్ఫూజ్ చేస్తారు. కర్ర విరగకుండా పాము చావకుండా రక్షణాత్మక ధోరణిలో సమాధానం చెప్పారు.
ఏపీకి ప్రత్యేక హోదా కల్పిస్తామని హామీ ఇచ్చాం.. కానీ 14వ ఆర్థిక సంఘం సూచనల ప్రకారం అది సాధ్యం కాకపోవచ్చు అన్నది జైట్లీ మాటల అర్థం. దీంతో ఏపీలో మళ్లీ నిరసనలు వ్యక్తమవుతున్నాయి. విభజన వల్ల తీవ్రంగా నష్టపోయిన ఆంధ్రప్రదేశ్ తిరిగి కోలుకోవాలంటే ప్రత్యేక హోదా ఇవ్వాల్సిందేనన్నారు మంత్రి మృణాళిని. ఆంధ్రప్రదేశ్కు ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రత్యేక హోదా తెస్తామంటున్నారు పిఠాపురం ఎమ్మెల్యే వర్మ. గత ప్రభుత్వం సరిగ్గా డాక్యుమెంటేషన్ చేయకపోవడం వల్లే.. ఇప్పటి ప్రభుత్వం స్పెషల్ స్టేటస్ ఇవ్వలేకపోతుందన్నారాయన. ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా ఇస్తానని చెప్పి.. ఇప్పుడు మాట మార్చడం కేంద్ర ప్రభుత్వానికి సరికాదన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు తెలకపల్లి రవి. తన విశ్వసనీయతను కాపాడుకోవాలంటే.. స్పెషల్ స్టేటస్పై కేంద్రం వెంటనే ఏదోకటి తేల్చి చెప్పాలన్నారు రాజకీయ విశ్లేషకులు బండారు శ్రీనివాసరావు. ప్రత్యేక హోదాకు14వ ఆర్థిక సంఘం నివేదికే అడ్డంకి అని చెబుతున్న బీజేపీ నేతలు.. ఎన్నికల్లో తామిచ్చిన హామీలను లెక్కలోకి తీసుకోరా అని ప్రశ్నిస్తున్నారు ఏపీ నేతలు. మోడీ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీకే దిక్కులేని పరిస్థితి రావడమేంటని మండిపడుతున్నారు.
*అభినవచారి*
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more