పాపం అని దయదలిచి సహాయం చేస్తే వద్దు వద్దు అంటూ భారత సైనికులను తిప్పిపంచింది నేపాల్. గత వారంలో జరిగిన భారీ భూకంపానికి నేపాల్ మొత్తం కకావికలం అయింది. దాంతో పక్కనున్న దేశంగా భారత్ తనవంతు సహాయాన్ని అందించింది. వేల మంది సైనికులను అక్కడికి పంపించడం, రెస్కూ టీంల సహాయంతో భూకంప బాధితులను రక్షించడం, అక్కడి బాధితులకు తాగు నీరు, ఆహారం లాంటి వాటిని అందించడం భారత్ చేసింది. అయితే అక్కడ తమ ప్రభుత్వం చేస్తున్న కార్యకలాపాలకు అడ్డుకలుగుతోందని, భారత మీడియా అతి చేస్తోందని, భారత్ సాయంపై అంతర్జాతీయంగా వెల్లువెత్తిన ప్రశంసలతో నేపాల్ అక్కడి నుండి తమ సహాయ కార్యక్రమాలను నిలిపివెయ్యాలని, అక్కడికి సహాయం చెయ్యడానికి వచ్చిన వారిని వెంటనే వెళ్లిపోవాలని కోరింది. దాంతో అక్కడి నుండి చాలా మంది తిరిగి ఇండియాకు వచ్చేశారు.
అలా సహాయం చెయ్యడానికి వెళ్లిన భారతీయులకు ఓ రకంగా అవమానమే జరిగింది. మంచి చెయ్యడానికని వెళితే చెడు ఎదురైనట్లుంది భారత్ పరిస్థితి. అయితే భారత్ సాయం లేదని తాము తిరిగి కుదుటపడే పరిస్థితిలో లేమని అక్కడి వారు ఓ నిర్ణయానికి వచ్చినట్లున్నారు. అందుకే నేపాల్ ప్రధాని సుశీల్ కోయిరాలా భారత ప్రధాని నరేంద్ర మోదీని కలవనున్నారు. తమ దేశానికి ఇండియా సహాయం ఖచ్చితంగా కావాల్సిందేనని ఆయన ప్రధానిని కోరనున్నారు. అయితే అప్పుడు పొమ్మ్న్న వారే ఇప్పుడు మాత్రం రమ్మని మరీ బొట్టు పెట్టి పిలుస్తున్నారు. అప్పుడు అవమానించిన వారే ఇప్పుడు ఎర్రతివాచీ పరిచి మరీ ఆహ్వానం పలుకుతున్నారు. బహుశా దీన్నే బ్యాడ్ టైం అంటారేమో. మరి దీనిపై భారత ప్రధాని నరేంద్ర మోదీ ఎలా స్పందిస్తారో చూడాలి.
*అభినవచారి*
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more