వెర్రి వెయ్య రకాలని పెద్దలు అంటుంటారు కానీ, దానిని నిజంగా చేస్తు.. ఇక్కడ కోందరు యువకులు సాహసం చేస్తూ తల్లితండ్రులకు కంగారు పెట్టిస్తున్నారు. అదేంటి అన్న సందేహాలు వద్దండోయ్. డైరెక్టుగా విషయానికి వస్తున్నాం. గతంలో ఫేస్బుక్ వేదికగా ఏఎల్ఎస్ వ్యాధి నివారణ కోసం ప్రారంభించిన ఐస్ బకెట్ ఛాలెంజ్ విస్తృతంగా ప్రాచుర్యం పొందింది. అయితే, ఇప్పుడు కొత్తగా వచ్చిన 'ఫైర్ ఛాలెంజ్' మాత్రం విపరీతంగా విమర్శల పాలవుతోంది. ఇది తల్లిదండ్రులకు తలనొప్పిగా మారింది. తమ బిడ్డలు ఎక్కడ ఇలాంటి సాహాసాలు చేసి ప్రాణాల మీదకు తెచ్చుకుంటారోనని కంగారు పడుతున్నారు. ఎందుకంటారా..?
ఈ ఫైర్ ఛాలెంజ్ లో పిల్లలు ఒంటిమీద కిరోసిన్ లాంటి ద్రవాన్ని పోసుకుని, నిప్పంటించుకుంటున్నారు. ఆ తర్వాత మంటలు వ్యాపించేలోగా వాళ్లు స్విమ్మింగ్ పూల్లోకి దూకాలి. అయితే, ఈ ఛాలెంజిలో పాల్గొంటున్న యువకుల్లో కొందరు తీవ్రంగా గాయపడుతున్నారు. దాంతో ఇలా నిప్పంటించుకుని గాయపడిన ఇద్దరు పిల్లల తల్లిదండ్రులు ఇలాంటి వీడియోలను ఆన్లైన్లో పెట్టొద్దంటూ వేడుకుంటున్నారు. ర్ఛాలెంజ్లో పాల్గొన్న టైలర్ ఓ కానర్ (9), అతడి అన్న షౌన్ (11) తీవ్ర గాయాలతో తప్పించుకున్నారు. వాళ్లు నిప్పంటించుకున్న వీడియో ఇంటర్నెట్లో విస్తృతంగా వ్యాపించింది. ఇది ఫేస్బుక్, యూట్యూబ్లలో కూడా షేర్ అయ్యింది. ఇలాంటి ఇబ్బందుల్లోకి తోటి పిల్లలను నెట్టొద్దని వాళ్ల తల్లిదండ్రులు కోరుతున్నారు. ఇప్పుడు ఏ ఫోన్ వచ్చినా భయం వేస్తోందని, పిల్లలు ఆస్పత్రిలో ఉన్నారనో.. మరణించారనో కబురు వస్తుందన్న భయంతో ఉన్నామని అంటున్నారు. లండన్ అగ్నిమాపక శాఖ అధికారులు కూడా నిప్పుతో ఇలాంటి ప్రమాదకరమైన ఫీట్లు చేయొద్దనే చెబుతున్నారు.
జి. మనోహర్
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more