కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ ‘కిసాన్ సందేశ్ యాత్ర’ పేరిట తెలంగాణ రాష్ట్రంలోని ఆదిలాబాద్ జిల్లాలో శుక్రవారం పర్యటించారు. బాధిత రైతు కుటుంబాలను పరామర్శించి.. తనవంతు ఆర్థిక సహాయాన్ని అందించారు. అలాగే.. తన ప్రసంగంతో రైతులకు భోరాసా కల్పించారు. రైతులకు నిత్యం అండగా వుండేది కాంగ్రెస్ పార్టీయేనని, అవసరమైతే రైతుల కోసం పార్లమెంటులో పోరాడతానని, ఉద్యమించడానికైనా తాను సిద్దమని రాహుల్ గాంధీ రైతులకు హామీ ఇచ్చారు. అనంతరం ఆయన తన పర్యటన ముగించుకుని తిరుగు ప్రయాణమయ్యారు.
అయితే.. ఈ రాహుల్ పర్యటనపై రకరకాలుగా వ్యాఖ్యలు, వార్తలు వెలువడుతున్నాయి. రాహుల్ గాంధీ రైతులను పరామర్శించి నేపథ్యంలోనే తెలంగాణ సర్కార్ కళ్లు తెరుచుకుందని అభిప్రాయాలు వెలువడుతున్నాయి. తెలంగాణ రాష్ట్రంలో ఎంతోమంది రైతులు బలైపోతున్నారన్న విషయం రాహుల్ గాంధీ పర్యటన ద్వారా టీఎస్ ప్రభుత్వానికి తెలిసొచ్చిందని కాంగ్రెస్ పార్టీ డప్పు కొట్టేసుకుంటోంది. ముఖ్యంగా.. రాహుల్ పర్యటన సీఎం కేసీఆర్ కళ్లు తెరిపించిందని కాంగ్రెస్ వర్గాలు చెప్పుకుంటున్నాయి. మరికొంతమంది మాత్రం రాహుల్ యాత్రపై తీవ్ర విమర్శలు గుప్పించారు.
ఇప్పటికే రాహుల్ ను అమాయకంగా పోల్చుతూ తెలంగాణ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కాంగ్రెస్ పార్టీ మీద తారాస్థాయిలో విరుచుకుపడ్డారు. రాహుల్ యాత్ర రైతులకు భరోసా కల్పించడం కోసం కాదని.. తెలంగాణలో కాంగ్రెస్ ని బలపరుచుకోవడం కోసమేనని ఎద్దేవా చేశారు. ఈ విధంగా ఈయన చేసిన వ్యాఖ్యలకు అటు కాంగ్రెస్ పార్టీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. తుమ్మల కామెంట్లపై తాజాగా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత వి.హన్మంతరావు ఘాటుగానే స్పందించారు. కేసీఆర్ కళ్లు తెరిపించేందుకే రాహుల్ గాంధీ వచ్చారని ఆయన పేర్కొన్నారు.
ఈ క్రమంలోనే వీహెచ్ మాట్లాడుతూ.. రాష్ట్రంలో నిత్యం రైతులు ఆత్మహత్యలు జరుగుతున్నా.. కేసీఆర్ ఏమాత్రం స్పందించలేదని అన్నారు. అయితే.. రాహుల్ గాంధీ పర్యటనతోనైనా రైతుల కష్టాలు తెలంగాణ సర్కార్ కి తెలిసొస్తాయని, ఈసారైనా కేసీఆర్ కళ్లు తెరుస్తారనుకుంటున్నామని ఆయన అన్నారు. ఈ విధంగా ఈయన చేసిన వ్యాఖ్యలపై టీఆర్ఎస్ ఏ విధంగా స్పందిస్తుందో వేచి చూడాల్సిందే!
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more