రాజధానికి భూములను ఇచ్చేందుకు ససేమిరా అంటూ న్యాయస్థానాలను అమరావతి పరిసర ప్రాంతాల ప్రజలు ఆశ్రయిస్తూ.. ఓ వైపు నిరసనలు, ఆందోళనలతో తమ వ్యతిరేకతను ప్రకటిస్తున్నా.. మరోవైపు రైతుల నుంచి వారి భూములను బలవంతంగా లాక్కోవడానికి నవ్యాంధ్ర సర్కారు అడుగుముందుకేసింది. రాజధాని నిర్మాణానికి భూములను ఇచ్చేందుకు వ్యతిరేకించిన రైతుల నుంచి వారి భూములను బలవంతంగా సేకరించేందుకు నూతన ఆర్డినెన్స్ను తీసుకువచ్చింది ఆంద్రప్రదేశ్ ప్రభుత్వం.
భూ సమీకరణకు రూపొందించిన సీఆర్డీఏ చట్టం విఫలమవడంతో ప్రభుత్వం కొత్తగా భూసేకరణకు జీఓ నెంబరు 166ను జారీ చేసింది. కేంద్ర ప్రభుత్వం కొత్తగా జారీ చేసిన ఆర్డినెన్స్కు అనుకూలంగా నోటిఫికేషన్ విడుదల చేసింది. భూసేకరణ చట్టం-2013లో 2.3 చాప్టర్లను మినహాయిస్తూ నోటిఫికేషన్ ఇచ్చింది. భూసేకరణ వల్ల సామాజిక ప్రభావం నిబంధనలను ఈ నోటిఫికేషన్లో మినహాయించింది. రెండు,మూడు పంటలు పండే భూములను సేకరించే నిబంధనలను మినహాయిస్తూ నోటిఫికేషన్ ఇచ్చింది. శుక్రవారం నుంచి భూసేకరణ చట్టం అమలు చేస్తామని ప్రభుత్వం స్పష్టం చేసింది.
ఈ నెలఖారు లోగా పంటలు చేతికందుతాయని, అవి పూర్తికాగానే భూ సమీకరణను పనులను వేగవంతం చేస్తామని మంత్రి నారాయణ తెలిపారు. రేపటి నుంచే భూ సేకరణ పనులను చేపట్టనున్నట్లు చెప్పారు. భూములను ఇచ్చేందుకు అంగీకరించని రైతుల భూములను 2013 భూసేకరణ చట్టం కింద భూములను స్వాధీనం చేసుకుంటమాని, అ నిబంధనలో పోందుపర్చినట్లే పరిహారం కూడా కల్పిస్తామని ఆయన స్పష్టం చేశారు. రైతులు కోర్టుకు వెళ్లడం వల్లే భూసేకరణ ఆర్డినెన్సును తీసుకురావాల్సివచ్చిందన్నారు. ఇప్పటి వరకు 14800 ఎకరాలను అప్పగిస్తూ రైతులు అంగీకార ఒప్పందాలు ఇచ్చారని మంత్రి నారాయణ చెప్పారు.
జి. మనోహర్
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more