మనిషిని సమాధి చేస్తారా.. ఇది మనుషులు చేసే పనియేనా.. మనలో పాపం చేయని వారు ఎవరో చెప్పండీ.. ఏ లోపం లేని వారు ఎవరో చూపండీ అంటూ ఆంధ్రుల అభిమాన నటుడు స్వర్గీయ ఎన్టీరామారావు పాడిన పాటను బీహార్ లోని గయ వాసులకు వినిపించాల్సిన అవసరం వుంది. ఎందుకంటే అక్కడ ఇకా ఆటవిక శిక్షలు అమలవుతున్నాయి. ఇటీవల తన పెళ్లి రద్దు చేయాలని, తనకు ఏడాది కూడా నిండకుండా పసిదానిగా వున్న వయస్సులో పెళ్లి చేశారని అది చెల్లదని, దానిని రద్దు చేయాలని కోరిన ఓ బాలిక తండ్రికి 16 లక్షల రూపాయల జరిమానా విధించిన కాప్ (కుల) పంచాయితీ ఘటన వెలుగులోకి వచ్చిన రెండురోజుల్లోనే తాజాగా, ఇప్పుడు బీహార్ లోని గయలో మరో గ్రామ పంచాయితీ దాష్టికం బయటకు వచ్చింది.
.
అక్రమ సంబంధం వుందన్న ఆనుమానాల నేపథ్యంలో గ్రామ పంచాయతీ పెద్దల సమక్షంలో వందలాది మంది గ్రామస్తులు చూస్తుండగానే ఆటవికమైన శిక్షను అమలు చేశారు. దేశానికి స్వాత్రంత్యం వచ్చిన 67ఏళ్ల గడుస్తున్నా. బలమైన న్యాయవ్యవస్థ, చట్టాలు వున్నా.. ఇంకా కులపంచాయితీల ఆటవిక శిక్షలు.. అనాగరిక చర్యలకు పాల్పడుతున్నారు. వివాహేతర సంబంధం వుందన్న అనుమానంతో.. దానిని నిర్థారించకుండానే.. 16 ఏళ్ల అమ్మాయిని, 32 ఏళ్ల వ్యక్తిని విచక్షణా రహితంగా కొట్టి సజీవ దహనం చేశారు.
పెళ్లయి ముగ్గురు పిల్లలున్న వ్యక్తి తన అత్తగారింటికి తరచూ వచ్చి వెళుతూ ఉండేవాడు. ఈ క్రమంలో గ్రామంలోని ఈ పదహారేళ్ల అమ్మాయితో పరిచయం ఏర్పడింది. మూడు రోజుల క్రితం ఇద్దరూ కనిపించకుండా పోయారు. దీంతో ఇద్దరినీ వెతికి పట్టుకున్న అమ్మాయి బంధువులు పంచాయితీకి ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలోనే పంచాయతీ పెద్దలు సమావేశాన్ని ఏర్పాటుచేసి శిక్షను ఖరారు చేశారు. వారి ఆదేశాల ప్రకారమే బుధవారం ఈ శిక్షను అమలు చేశారు. బాలిక తల్లిదండ్రులు, ఇతర బంధువుల సమక్షంలోనే ఈ ఘోరం జరిగింది. గ్రామంలో ఒక్కరు కూడా ఈ ఘటనను వ్యతిరేకించలేదు, కనీసం పోలీసులకు తెలియజేయలేదు.
పొరుగున ఉన్న గ్రామస్తుల ద్వారా విషయం తెలుసుకున్న పోలీసులు గ్రామంలో మోహరించారు.ఈ ఘటనకు సంబంధించి ఒకరిని అదుపులోకి తీసుకున్నారు. బాలిక తల్లిదండ్రులతో సహా, 20 మందిని అనుమానితులుగా గుర్తించామని, తదుపరి విచారణ అనంతరం మిగతావారిని కూడా అరెస్ట్ చేస్తామని సీనియర్ పోలీసు అధికారి షాలిన్ తెలిపారు. తప్పు చేసిన వారిని శిక్షించడానికే కోర్టులు, చట్టాలు ఉన్నా.. కుల, గ్రామ పంచాయితీలు శిక్షలను విధించడంపై మానవ హక్కుల సంఘాల నాయకులు తీవ్రంగా ఖండిస్తున్నారు. ఇంకా మధ్య యుగాల నాటి శిక్షలు అమలు కావడంపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
జి.మనోహర్
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more