అందరి పిల్లల్లాగే తాను పెరిగింది. తల్లిదండ్రులు చూపించిన ప్రేమ అనురాగాల మధ్య పెరిగి పెద్దదైంది. అయితే ఆక్కడి నుంచి కబురు వచ్చే వరకు తనకు తెలియదు తన వివాహం జరిగిపోయిందని. అయితే తాను అత్తవారింటికి వెళ్లలని. సాంఘిక దురాచాలకు దూరంగా వుండాలని భావించి తన నిర్ణయాన్ని తన తల్లిదండ్రులకు తెలిపింది. వారు సరేనన్నారు. అయితే పెళ్లి సమయంలో తీసుకున్న కట్నా కానులకు తరిగిపోయాయేమో తెలియాదు కానీ., అత్తింటి వారు కుల పంచాయితీకి వెళ్లారు. బాల్య వివాహాలను అడ్డకోవాల్సిన కుల పంచాయితీ.. అమె తండ్రిపై భారీ పరిహారం చెల్లించాలని తీర్పునిచ్చింది. అయితే ఇందుక ఎవరిది బాధ్యత..?
తల్లి పొత్తిళ్లలో హాయిగా నిద్రపోతోన్న 11 నెలల పసికూనను తొమ్మిదేళ్ల బాలుడికి ఇచ్చి పెళ్లిచేశారు. అనుకున్న మాట ప్రకారం అబ్బాయి కుటుంబానికి లాంచనాలు ముట్టజెప్పారు. చిన్నారికి ఈడొచ్చాక కాపురానికి పంపించాలని తీర్మానించుకున్నారు. ఆ తరువాత ఆ పాపాయి కుటుంబం ఉపాధి కోసం పల్లె నుంచి పట్నానికి మకాం మార్చింది. కాలం గిర్రున తిరిగింది. ఆ 11 నెలల చిన్నారికి ప్రస్తుతం 19 ఏళ్లు. పేరు శాంతా దేవి మేఘావాల్. జోధ్పూర్లోని జై నారాయణ్ వ్యాస్ యూనివర్సిటీలో డిగ్రీ రెండో సంవత్సరం చదువుతోంది.
కాపురానికి రావాలంటూ ఈ మధ్యే ఆమె అత్తగారి ఇంటినుంచి కబురొచ్చింది. అభం శుభం తెలియని వయసులో జరిగిన పెళ్లి తనకు ఇష్టం లేదని, కాపురానికి వెళ్లే ప్రసక్తేలేదని శాంతాదేవి తల్లిదండ్రులకు తేల్చిచెప్పింది. అందుకు సరేనన్నఆమె తల్లిదండ్రులు.. సదరు వరుడి బంధువులకు ఇదే విషయం చెప్పారు. దీంతో కోపోద్రిక్తులైన వరుడి తల్లిదండ్రులు కుల పంచాయతీ పెట్టించారు. శాంతాదేవి కాపురానికి రావాల్సిందేనని గ్రామపెద్దలు బెదిరించారు. రానిపక్షంతో రూ. 16 లక్షలు పరిహారం చెల్లించాలని తీర్పు ఇచ్చారు. దీంతో బెదిరిపోయిన శాంతాదేవి ఓ స్వచ్ఛంద సంస్థ సహకారంతో సోమవారం జోధ్పూర్లో ప్రెస్మీట్ నిర్వహించి తన గోడును మీడియాకు వెల్లడించింది. బాగా చదుకొని టీచర్ కావాలనుందని, తన బాల్య వివాహం రద్దయ్యేందుకు సహకరించాలని కోరింది. ఈ వ్యవహారంపై రాజస్థాన్ హోం మంత్రి గులాబ్ చంద్ కటారియా స్సందించారు. పోలీసులకు ఫిర్యాదు చేయాల్సిందిగా బాధితురాలికి సూచించారు.
జి. మనోహర్
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more