మాజీ కేంద్రమంత్రి కిల్లి కృపారాణి భర్త రామ్మోహనరావుపై విశాఖ జిల్లా భీమిలి పోలీస్స్టేషన్లో కేసు నమోదైంది. డబ్బు లావాదేవీల విషయంలో చంపుతానని బెదిరించడంతో ఆయనపై భీమిలికి చెందిన ఓ వైద్యుని భార్య మంగళవారం పోలీసులకు ఫిర్యాదు చేసింది. భీమిలి పోలీసుల కథనం ప్రకారం కేంద్ర మాజీ మంత్రి కిల్లి కృపారాణి భర్త డాక్టర్ కిల్లి రామ్మోహనరావు(శ్రీకాకుళం) భీమిలి ఎస్.ఒ.ఎస్.చిల్డ్రన్స్ విలేజ్ సమీపంలో ఉంటున్న డాక్టర్ ఎన్ .ఎల్.రావు స్నేహితులు. రామ్మోహనరావు మధురవాడ సమీపంలో ఓ స్థలానికి సంబంధించిన వ్యవహారంలో ఇటీవల డాక్టర్ ఎన్.ఎల్.రావుకు రూ.23లక్షలు ఇచ్చారు. ఆపని జరగక పోవడంతో అందులోని రూ.20లక్షలు ఎన్.ఎల్.రావు తిరిగి ఇచ్చేయగా మూడులక్షలు ఇవ్వాల్సి ఉంది. ఈ సొమ్ము కోసం రామ్మోహనరావు కారులో డ్రైవర్ ధనుంజయ్తో మంగళవారం మధ్యాహ్నం ఎన్.ఎల్.రావు ఇంటికి వచ్చారు. ఈ సమయంలో వారు మద్యంసేవించి ఉన్నారు. ఎన్.ఎల్.రావు ఇంట్లో లేరు. ఆయన భార్య ఎన్.సుగుణ, వాచ్మన్ మహలక్ష్మినాయుడు ఉన్నారు.
ఆర్ధిక లావాదేవీల కారణంగా రామ్మోహనరావు డాక్టర్ ఇంటిపై దాడి చేశారని, అక్కడే ఉన్న డాక్టర్ భార్య సుగుణను, వాచ్మెన్ మహాలక్ష్మీనాయుడును కారులో ఎక్కించుకునే ప్రయత్నం చేశారని డాక్టర్ సతీమణి పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. వాచ్మెన్ మహాలక్ష్మినాయుడుని ఎర్రమట్టి దిబ్బల వరకు తీసుకువెళ్లి రామ్మోహనరావు డ్రైవర్ ధనుంజయ్ కొట్టి పడేశారు. ఫిర్యాదు మేరకు పోలీసులు రామ్మోహనరావు, ఆయన డ్రైవర్ ధనుంజయ్లను అదుపులోకి తీసుకున్నారు. భూ వివాదం కారణమే ఈ దాడికి కారణమని పోలీసులు తెలిపారు. కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నట్లు భీమిలి ఎస్ఐ అప్పారావు చెప్పారు.మరి ఘటనపై పోలీసులు నిజాలను వెలికితీయాల్సి ఉంది.
(Photo from Anhdra prabha news paper)
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more