మీ అబ్బాయి మద్యం సేవిస్తున్నాడా..? ఎంత వారించినా తాగడం అపడం లేదా..? మద్యానికి డబ్బులు కావాలని మిమల్ని ప్రతినిత్యం వేధిస్తున్ానడా..? అయితే ఇలా మాత్రం చేయకండి. ఇక్కడ ఓ కసాయి తండ్రి తన కొడుకును మద్యం తాగకుండా వుండేందుకు దారుణమైన నిర్ణయం తీసుకున్నాడు మీరు అలా చేయమాకండి. మద్యం మాన్పించేందుకు ఎన్నో మార్గాలు అందుబాటులో వున్నా.. చేతికందిన కోడుకును ఇలా చేస్తారా ఎవరైనా..? ఏం చేశాడని అనుకుంటున్నారు. మీరే చదవండి..
తాగుబోతు కోడుకు తమకు ఇబ్బందుకు పెడుతున్నాడని.. ఓ కసాయి తండ్రి అతడిని హతమార్చాడు. అయితే చూస్తూ, చూస్తూ కన్న కోడుకును చేజేతులా చంపడానికి మనస్సు అంగీకరించలేదో ఏమో.. అందకనే ఏకంగా కిరాయి హంతకులను మాట్లాడి.. తన కోడుకు వారి చేతిలో పెట్టాడు. తాగుడు మాన్పించేందుకు బదులు ఇలా కొడుకు మద్యాన్ని మాన్పించేందుకు హతమారుస్తారా..? అంటూ తండ్రిపై అనేక మంది విమర్శలు గుప్పిస్తున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు దర్యాప్తు చేసేసరికి అసలు విసయం అంగీకరించాడు.
చిత్తూరు జిల్లా తోటబెడు మండల పరిధిలోని దిగువ సాంబయ్య పాలెంలో చోటుచేసుకున్న ఈ ఘటన వివరాలు ఇలా వున్నాయి. తిరుమల తిరుపతి దేవస్తానంలోని సులబ్ కాంప్లెక్స్ లో ఉద్యోగిగా వున్న మునిశేఖర, మునెమ్మ దంపతులకు రాంబాబు అనే ఇంజనీరింగ్ చదవుతున్న కోడుకు వున్నాడు. ఈ మధ్య అతను తాడుగు బానిసై.. అందుకు డబ్బుల కోసం ప్రతిరోజు తన తల్లిదండ్రులను వేదిస్తున్నాడు. ఈ నేపథ్యంలో కోడుకు వేధింపులను భరించలేని తండ్రి.. అతని హతమార్చేందుకు కిరాయి హంతకులను మాట్లాడాడు.
ఈ క్రమంలో సోమవారం రోజున తన కొడుకు రాంబాబును వెంటబెట్టుకుని తన తండ్రి వుంటున్న దిగువ సాంబయ్యపాలెం వెళ్లాడు. అక్కడ కిరాయి హంతకులకు కోడుకును అప్పగించి వెనుదిదిరిగాడు. అతన్ని హతమార్చిన హంతకులు శవాన్ని అక్కడే వదిలేసి వెళ్లిపోయారు. సోమవారం రోజున హతుడి సోదరి, తన కూతురు లతకు ఫోన్ చేసి రాంబాబును ఎవరో హత్య చేశారని సమాచారం ఇచ్చాడు. దీంతో తండ్రి ప్రవర్తనపై అనుమానం కలిగిన అమె పోలీసులను ఆశ్రయించడంతో.. అదుపులోకి తీసుకుని విచారించగా, నిజాన్ని అంగీకరించాడు.
జి. మనోహర్
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more