టిఆర్ఎస్ అధ్యక్ష్యుడిగా ఎనిమిదో సారి కేసీఆర్ ఎన్నికలను అధికారికంగా ప్రకటించారు. హైదరాబాద్ లో ఏర్పాటుచేసిన టీఆర్ఎస్ ప్లీనరీలో ఆయన స్వంత పార్టీ కార్యకర్తలకు ఉత్సాహాన్ని నింపడంతో పాటు, కాంగ్రెస్, టిడిపిపై విమర్శనాస్త్రాలు సంధించారు. తనను మరోసారి అధ్యక్షుడిగా తనను ఎన్నుకున్నందుకు పార్టీ నేతలకు, కార్యకర్తలకు, పార్టీ శ్రేణులకు కృతజ్ఞతలు తెలిపారు. పోరాటం అంటే ముందుకు పోవటమే అని అన్నారు. తెలంగాణ కోసం ప్రాణాలు అర్పించినవారి కుటుంబ సభ్యులను అన్నివిధాలా ఆదుకుంటామని కేసీఆర్ హామీ ఇచ్చారు. రానున్న నాలుగేళ్లలో వాటర్ గ్రిడ్ ప్రాజెక్ట్ ను పూర్తి చేస్తామని కేసిఆర్ హామీ ఇచ్చారు. టిఆర్ఎస్ పార్టీ శాశ్వతంగా ఉంటుందని కూడా స్పష్టం చేశారు.
కేసీఆర్ స్పీచ్ లో హైలైట్స్....
* పార్టీకి అధ్యక్షుడినే అయినా ప్రతి ఒక్క కార్యకర్త సలహాని స్వీకరించామరని కేసీఆర్ అన్నారు
* ఎన్ని ఇబ్బందులు వచ్చినా 14 ఏళ్లుగా పార్టీ కొనసాగుతూనే ఉంది.
* టీఆర్ఎస్ పార్టీ శాశ్వతంగా ఉంటుంది.
* ఎన్నో పార్టీలు వచ్చి పోయాయి.
* ఎన్నో జయాలు చూశాం.. అపజయాలూ చూశాం.
* తెలంగాణ కోసం ఎంతో మంది లాఠీ దెబ్బలు తిన్నారు.. జైళ్లకు వెళ్లారు.
* వాళ్లంతా బంగారు తెలంగాణ కోసం పాటుపడ్డారు.
* తెలంగాణ ప్రజలు సొంత రాష్ట్రం కోసం ఎన్నో బాధలు పడ్డారు.
* ఈ కష్టంలో భాగమైన ప్రతి ఒక్కరినీ కృతజ్ఞతలు.
* 2001 లో పార్టీ ప్రారంభమైనప్పుడు నేను ఒక్కడినే.
* తర్వాత లక్షల మంది వచ్చి చేరారు.
* ఎన్ని ఆరోపణలు వచ్చినా నాతో కలిసి పని చేశారు.
* ఉద్యమాలతో ప్రారంభమైన పార్టీని నిలబెట్టింది మాత్రం ప్రజలే.
* తెలంగాణ వాదాన్ని ప్రజలు పట్టించుకునే విధంగా పత్రికల్లో వ్యాసాలు రాశారు.
* పోరాటం అంటే ఎన్నడూ వెన్ను చూపలేదు మన ప్రజలు.
* ఎన్ని కష్టాలొచ్చినా ఉద్యమాన్ని వీడలేదు.
* కుంభమేళను తలపించేలా గోదావరి పుష్కరాలు
* తెలంగాణ సాంస్కృతిక పునరుజ్జీవనం జరుగుతోంది.
* కాంగ్రెస్ నేతలు ప్రజల గురించి ఏనాడైనా ఆలోచించారా ?
* పాఠశాలల్లో సన్నబియ్యంతో అన్నం పెట్టే పథకం.
* ఈటెల రాజేందర్ సన్నగానే ఉంటాడు.
*నేనూ సన్నగానే ఉంటాను.
*ఈ పథకం తెచ్చిన ఘనత తెలంగాణ ఆర్థిక మంత్రిదే.
*ఆ పథకానికి ఛాంపియన్ నా తమ్ముడు ఈటెల రాజేందరే.
*అంగన్ వాడీ అక్కా చెల్లెళ్లకు జీతాలు పెంచాం.
*700 కోట్ల అదనపు భారాన్ని అంగన్ వాడీ వర్కర్ల కోసం కేటాయించాం.
* 34 లక్షల రైతు కుటుంబాలకు రుణమాఫీ
* 17వేల కోట్ల రూపాయలతో రుణమాఫీ చేస్తున్నాం
* కాంగ్రెస్ నాయకులు అవాకులు చెవాకులు పేలుతున్నారు
* బీడీ కార్మికులకు నెలకు రూ.వెయ్యి పింఛన్లు
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more