తెలంగాణ మంత్రిగారు చేసిన నిర్వాకం ఇప్పుడు అందరి నుండి విమర్శలు కురిపిస్తోంది. ఇంతకీ ఎందుకు అలా అంటే వికలాంగురాలు వినతి చేసుకుందామని అనుకుంటే మంత్రి గారు దాన్ని ఎంతలా విమర్శించారంటే.. ప్రతి దానికి హైదరాబాద్ కు రావడం ఫ్యాఫనైపోయింది అని విసక్కున్నారు. ఇప్పుడు ఇదే వార్త మీడియాలో హల్ చల్ చేస్తోంది. మంత్రి గారు వినతి తీసుకుంటారని అనుకుంటే మీద నుండి నాలుగు దండకాలు చదివెయ్యడం అక్కడున్న వారందరికి ఆశ్చర్యం కలిగించింది. మరి అసలు ఎక్కడ జరిగింది.. ఎవరా మంత్రి. ఎవరా బాధితురాలు.. వివరాలు తెలియాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే..
నల్లగొండ జిల్లా సూర్యాపేటలోని ఆర్వీఎం ఉద్యోగిని అయిన రమాదేవి అనే మహిళ.. పై అధికారులు తనను వేధిస్తున్నారని, అనవసరంగా బదిలీ చేసేందుకు యత్నిస్తున్నారని సీఎం కేసీఆర్కు ఫిర్యాదు చేసేందుకు సోమవారం పడుతూలేస్తూ సచివాలయానికి వచ్చింది. ఆమె ముఖ్యమంత్రి బ్లాక్ వద్దకు చేరుకునేసరికి మంత్రి కేటీఆర్ అటుగా వచ్చారు. దీంతో ఆమె తన సమస్యను ఆయనకు వివరించింది. ఆయన పక్కనే ఉన్న మంత్రి జగదీశ్ రెడ్డిని పిలిచి.. ‘‘మీ జిల్లాకు చెందిన ఆమెకు ఏదో సమస్య ఉందట’’ అని చెప్పారు.
‘‘సమస్య ఉంటే అక్కడే చెప్పాలిగానీ, ఇక్కడకు వచ్చి ఎందుకు విసిగిస్తున్నావు? ఇబ్బంది ఉంటే పోలీసులకు ఫిర్యాదు చెయ్యి. ఇక్కడకు రావద్దు.. మమ్మల్ని విసిగించొద్దు. ప్రతిదానికీ హైదరాబాద్ రావడం పెద్ద ఫ్యాషన్ అయిపోయింది’’.. పై అధికారుల వేధింపులతో సతమతమవుతూ ముఖ్యమంత్రికి తన గోడు వెళ్లబోసుకుందామని వచ్చిన ఓ వికలాంగ ఉద్యోగినిపై మంత్రి జగదీశ్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. చేస్తే సాయంచేయాలి లేదంటే కనీసం ఊరుకోవాలి అంతేతప్ప ఓ వికలాంగురాలిపై మంత్రి అంత పరుషంగా మాట్లాడటమేంటని అక్కడున్న వారంతా అనుకున్నారట. అయినా మంత్రి గారికి ఎందుకు కోపం వచ్చిందో మరి..?
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more