శేషాచలం అడవుల్లో జరిగిన 20 మంది కూలీల ఎన్ కౌంటర్ ఘటనను హత్యకేసుగా నమోదు చేయాలని హైకోర్టు శుక్రవారం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని ఆదేశించింది. సెక్షన్ 302 కింద కేసు నమోదు చేయాలని ఆదేశాలు ఇచ్చింది. తదుపరి విచారణను సోమవారానికి వాయిదా వేసింది. ఈ ఎన్ కౌంటర్ పై ఆంధ్రప్రదేశ్ పోలీసులు హైకోర్టుకు నివేదిక సమర్పించారు. ఎదురు కాల్పుల్లో పాల్గొన్న పోలీసులపై కేసు నమోదు చేశారా అని ఈ సందర్భంగా కోర్టు ప్రశ్నించింది. పోలీసు నివేదిక స్పష్టంగా లేదన్న హైకోర్టు, పూర్తి వివరాలతో మరోసారి నివేదిక సమర్పించాలని డిజిపీని ఆదేశించింది. ఎర్ర చందనం కూలీల ఎన్కౌంటర్పై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం హైకోర్టుకు నివేదిక సమర్పించింది. అయితే ప్రభుత్వం సమర్పించిన నివేదికపై న్యాయస్థానం అసంతృప్తి వ్యక్తం చేసింది. నివేదిక మృతి చెందినవారికి వ్యతిరేకంగా ఉందని అభిప్రాయపడింది. దీనిపై సమగ్ర సమాచారం ఇవ్వాలని ప్రభుత్వాన్నిహైకోర్టు ఆదేశించింది.
ఎర్రచందనం కోసం అడవిలోకి వచ్చిన కూలీలు కరడుగట్టిన స్మగ్లర్లు అని ఏపి డిజిపి రాముడు హైకోర్టుకు వివరించారు. గతంలోనే స్మగ్లర్లకు హెచ్చరికలు జారీ చేశామనీ, కానీ వాటిని పట్టించుకోకుండా వారు అడవిలో యధేచ్ఛగా ఎర్రచందనాన్ని స్మగ్లింగ్ చేయడానికి ప్రయత్నించారని ఆయన అన్నారు. స్మగ్లర్లను అడ్డుకునే క్రమంలో కూలీలు పోలీసులపై రాళ్లు రువ్వడమే కాకుండా గొడ్డళ్లతో దాడులకు దిగారని డిజిపి కోర్టుకు తెలిపారు. అడవిలొ ఏర్పాటు చేసిన కెమెరాల్లో వీడియో పుటేజ్ లు కూడా సాక్షంగా ఉన్నయని వెల్లడించారు. తప్పని సరి పరిస్థితిలో పోలీసులు స్మగ్లరలపై కాల్పులు జరిపారని డిజిపి హైకోర్టుకు నివేదించారు. తమిళనాట ఆందోళనలు అంతకంతకూ తీవ్ర రూపం దాల్చుతున్నాయి. అయితే ఎన్ కౌంటర్ పై తమిళనాడు ముఖ్యమంత్రికి ఏపి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు లేఖ కూడా రాశాడు. కానీ ఆందోళనలు మాత్రం చల్లారలేదు. చిత్తూరు కలెక్టరేట్ ను ముట్టడించాలని తమిళులకు వైగో పిలుపునివ్వడం తర్వాత అతన్ని అరెస్ట్ చెయ్యడం టకటకా జరిగిపోయాయి. మరి హైకోర్ట్ రేపు ఎలాంటి తీర్పును వెల్లడిస్తుందో అని అటు తమిళులు, ఏపి పోలీసులు కూడా ఆతృతగా ఎదురు చూస్తున్నారు.
- అభినవచారి
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more