ఆయన స్వయంగా పార్లమెంటు సభ్యుడు. అందునా అధికార బీజేపి పార్టీ నుండి... ఆయన ఎవరంటారా..? ఆయన పేరు రాంజ్ విజయ్ సింగ్ జుడో.. ఆయన తమ్ముడు విక్రమాదిత్య సింగ్ జూడో అచూకీ తెలిపినా, సమాచారాన్ని అందించినా.. అక్కడి పోలీసులు ఐదు వేల రూపాయల రివార్డను అందిస్తారట. అదేంటి నమ్మశక్యంగా లేదా. .? కానీ ఇది నిజం. రంజ్ విజయ్ సింగ్ సోదరుడు విక్రమాదిత్యపై రెండు వేర్వేరు కేసులు నమోదైన నేపథ్యంలో అతడిని పట్టుకుని కోర్టులో హాజరుపర్చేందుకు పోలీసులు చేసిన అన్ని ప్రయత్నాలు విపలమయ్యాయి. దీంతో ఆయన ఆచూకీ చెబితే రివార్డు ఇస్తామని పోలీసులు ప్రకటించారు.
ఇంతకీ ఆయన చేసిన నేరాలు ఏమిటంటారా..? ఐదేళ్ల క్రితం బలవంతంగా భూములను అక్రమించడంతో పాటు ఇద్దరు మైనర్ బాలురను పనిలో పెట్టుకున్న కేసులో ఎంపీ సోదరుడు నిందితుడు. అయితూ ఐదేళ్లుగా అదృశ్యంగా వున్న విక్రమాదిత్య తాజాగా ఓ పాఠశాల యజమానితో తలపడ్డాడు. బలవంతంగా భూములను అక్రమించకునేందుకు స్థానిక ప్రైవేటు పాఠశాల యజమాని పరమేశ్వర్ గుప్తాపై నుంచి కారు నడిపించి అతడిని హత్య చేసేందుకు కూడా యత్నించాడు. ఈ ఘటనలో అతనితో పాటు అతని ఇద్దరు అనుచరులపై కూడా కేసులు నమోదయ్యాయి. బరమేశ్వర్ గుప్తాపై హత్యయత్నం కింద కేసు నమోదైనప్పటి నుంచి సదరు నిందితుడు పరారీలో వున్నాడు. బరమేశ్వర్ కు చెందిన భూమి తన పూర్వికులకు సంబంధించినదంటూ వాగ్వాదానికి దిగిన విక్రమాదిత్య అతనిపై నుంచి వేగంగా కారును పోనిచ్చాడు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన బరమేశ్వర్ ను జాష్ పూర్ జిల్లా అస్పత్రిలో చేర్చి.. అక్కడి నుంచి జార్ఖండ్ రాజధాని రాంచీలోని సూపర్ స్పెషాలిటీ అస్పత్రికి తరలించారు. దీంతో స్థానికులు అందించిన సమాచారం మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఐదేళ్లుగా అధృష్యమైన వ్యక్తి వచ్చి అఘాయిత్యాలకు ఎలా పాల్పడుతున్నాడని పోలీసులపై కూడా విమర్శలు రేకెత్తుతున్నాయి.
జి. మనోహర్
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more