తెలంగాణ లో మరోసారి అన్నల ప్రాభల్యం మళ్లీ మొదటికి చేరుతుందా అనే అనుమానాలకు మరింత బలం చేకూరుతోంది. తెలంగాణ ఉద్యమం సమయంలోనూ నక్సల్స్ ప్రభావం ఉందని కేంద్రం అప్పట్లో హెచ్చరించింది. ఛత్తీస్ ఘడ్ లాంటి రాష్ట్రాల్లో మాదిరిగా నక్సల్స్ తెలంగాణ లో పాతుకుపోయే అవకాశాలు ఉన్నాయని కేంద్ర ఇంటలిజెన్స్ హెచ్చరికలు కూడా జారీ చేసింది. అయినా తెలంగాణ అంశం రాజకీయం కనుక ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు చెయ్యక తప్పలేదు. అయితే తాజాగా కొన్ని తెలంగాణ జిల్లాల్లో నక్సల్స్ కదలికలు మొదలయ్యాయని నివేదికల్లో తేలింది. దాంతో తెలంగాణ రాష్ట్ర పోలీసులు నిఘా ను పెంచారు. మరోసారి తెలంగాణలో అన్నల ప్రభావాన్ని ఏ మాత్రం పెరగకుండా కట్టడిచెయ్యడానికి నడుం బిగించారు.
తాజాగా నిజామాబాద్ జిల్లా పోలీసులు జనశక్తి గ్రూప్ నక్సల్స్ను ఐదుగురిని అరెస్టు చేశారు. వీరి నుంచి రెండు తపంచాలు, ఒక రివాల్వర్, కొన్ని డిటొనేటర్లు, బుల్లెట్లు, విప్లవసాహిత్యం, బెదిరింపు లేఖలను స్వాధీనం చేసుకున్నట్లు ఎస్పీ తెలిపారు. అరెస్టయిన వారిలో వేంపటి కుమార్ అలియాస్ గంగన్న అలియాస్ జీవన్, ఏదులకంటి లింగారెడ్డి అలియాస్ శ్యాం, జంగలం శంకర్, చండ్రుపట్ల సురేష్, అక్కల రాజు ఉన్నారు. అలాగే, వీరికి ఆశ్రయం కల్పించిన నేరంపై మరో ఐదుగురిని బైండోవర్ చేశారు. అంతేకాకుండా జనశక్తి గ్రూపుకు చెందిన కూర రాజన్న, దేవేందర్, విమలక్క తదితర నేతలపై కుట్ర కేసులు నమోదు చేసినట్లు ఎస్పీ వెల్లడించారు. నిజామాబాద్ జిల్లాలో గత కొంత కాలంగా అన్నల కదలికలపై పోలీసులు నిఘాను ఏర్పాటు చేశారు. అయితే తెలుగు రాష్ట్రాలైన తెలంగాణ, ఏపిలలో మరో సారి నక్సలైట్లు పూర్వ వైభవాన్ని పొందుతారా.. అన్నది ప్రస్తుతానికి తేలని ప్రశ్న.
- అభినవచారి
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more