ఉద్యోగాల కోసం వెంటనే ఉద్యోగ ప్రకటనలు విడుదల చెయ్యాలని ఉస్మానియా విద్యార్థులు చేసిన ధర్నాలతో తెలంగాణ ప్రభుత్వంలో కదలిక వస్తోంది. లక్ష ఉద్యోగాలను భర్తీ చేసేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఈ మేరకు ఆయా శాఖల్లో ఉద్యోగ ఖాళీల వివరాలను తెలపాలంటూ ముఖ్య మంత్రి కార్యాలయం నుంచి వివిధ శాఖల ముఖ్య కార్యదర్శులకు లేఖ అందింది. మరో వైపు డీఎస్సీ ద్వారా ఉపాధ్యాయుల నియామకం మరింత ఆలస్య మయ్యే అవకాశం కన్పిస్తోంది. ఉద్యమ కాలంలో ఎలాంటి నోటిఫికేషన్లు విడుదల కాకపోవ డంతో వయోపరిమితి సమస్య తలెత్తే అవకాశముంది. దీంతో వయో పరిమితి విషయంలో నిరుద్యోగ యువతకు 10 ఏళ్ల సడలింపును ఇవ్వాలని ప్రభుత్వం యోచిస్తోంది. ఇటీవలే ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్రావు త్వరలో లక్ష ఉద్యోగాలను భర్తీ చేయ నున్నామని అసెంబ్లిలో ప్రకటించినా ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. తాజాగా ఓయు విద్యార్థుల నుండి వ్యతిరేకత వస్తుండటంతో చర్యలకు పూనుకుంది తెలంగాణ సర్కార్.
రాష్ట్ర విభజన నేపథ్యంలొ ఉద్యోగుల విభజన కోసం కేంద్రం కమల్నాథన్ కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీ కేవలం రాష్ట్రస్థాయి కేడర్ పోస్టులనే విభజించనుంది. కమిటీ ఇప్పటికే ఉద్యోగుల సంఖ్యను తేల్చే ప్రక్రియను ఓ కొలిక్కి తీసుకొచ్చినట్లు సమాచారం. నిజానికి ఈ నెలాఖరులోపు ఉద్యోగుల వివరాలను కేంద్రానికి సమర్పించాల్సి ఉంది. కానీ ఆ పరిస్థితులు మాత్రం కనిపించడం లేదు. దీంతో కేంద్రం కమిటీ కమల్నాథన్ కమిటీని అక్టోబర్ వరకు పొడిగించింది. కమల్నాథన్ కమిటీ తన పని పూర్తిచేస్తే ఉద్యోగ ఖాళీల వివరాలపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది. రాష్ట్రంలోని వివిధ శాఖల్లో ఖాళీల సంఖ్య గణనీయంగా ఉంది. ఖాళీలను భర్తీ చేయ కపోవడంతో ఉన్న ఉద్యోగులతోనే సరిపెట్టుకోవాల్సి న పరిస్థితి నెలకొంది. కనీసం ఇప్పటికైనా తెలంగాణ సర్కార్ నోటిఫికేషన్లకు చర్యలు తీసుకోవడం నిరుద్యోగులకు మంచి వార్తే.
- అభినవచారి
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more