కేంద్రంలో బీజేపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి హిందుత్వ శక్తులు జడలు విప్పుతున్నాయి. పదేళ్ల యూపీఏ పాలతో స్థబ్దుగా వున్న హింధుత్వ శక్తులు ఇప్పుడు ఏకంగా మహనీయలను లక్ష్యంగా చేసుకుని వ్యతిరేక వ్యాఖ్యాలు చేస్తున్నారు. కేంద్రంలోని నేరేంద్ర మోడి ప్రభుత్వాన్ని అప్రతిష్టపాలు చేసేందుకు యత్నిస్తున్నారు. స్వయంగా ప్రధాని నరేంద్రమోడీ ఇలాంటి వ్యాఖ్యలు చేయరాదని హెచ్చరించిన తరువాత కూడా హిందుత్వ శక్తులు వాటి పరుధులను ధాటి వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తున్నాయి.
తాజాగా విశ్వ హిందూ పరిషత్ కు చెందిన నేత సాధ్వి ప్రాచీ మరో వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. భారత మాజీ ప్రధాన న్యాయమూర్తి మార్కండేయ ఖడ్జూ తరువాత ఆయన సాధ్వీ అవే వివాదాస్పద వ్యాఖ్యలను మళ్లి చేశారు. జాతిపిత మహాత్మా గాంధీ బ్రీటిష్ ఏజెంట్ అని అమె అన్నారు. మహాత్ముడు అహింసా మార్గం అనుసరించడంతోనే లేక తన చరకా తిప్పడం వల్ల భారతావని స్వత్రంత్యం రాలేదని భగత్ సింగ్, వీర్ సావర్కర్ లాంటి సమరయోధుల త్యాగాల వల్ల వచ్చిందని అమె అన్నారు.
అంతటితో అగకుండా భారత్ లో వున్నవాళ్లు భారత్ మాతాకీ జై, వందే మాతరం అని కీర్తించాలన్నారు. అలా అనేందుకు విముఖత చూపే వాళ్లు భారత్ లో వుండేందుకు అనర్హుల అని అమె వ్యాఖ్యానించారు. ఉత్తర్ ప్రదేశ్ లోని బాహర్యాచ్ జిల్లాలో నిర్వహించిన ఓక కార్యక్రమానికి అతిధిగా హాజరైన అమె.. ఈ మేరకు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. గతంలోనూ ఇదే తరహాలో హిందువులు నలుగురు పిల్లల్ని కంటే చాలని, ఓ వర్గాన్ని టార్గెట్ చేస్తూ.. వారిలా నలభై మందిని కనాల్సిన అవసరం లేదని కూడా వివాదాస్పద వ్యాఖ్యాలు చేశారు.
జి. మనోహర్
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more