భారతావని ముద్దు బిడ్లలం అని గర్వంగా చెప్పుకునే మనం.. స్వతంత్ర్యం లభించి డెభై వసంతాలకు చేరువవుతున్నా ఇంకా మనల్ని కుల, మత, ప్రాంత జాడ్యాలు వీడటం లేదు. కులాంతర వివాహాలు చేసుకునేందుకు యువకులను ప్రోత్సహిస్తున్న ప్రభుత్వం పలు పథకాలను కూడా ప్రవేశపెడుతుండగా, ఇంకా కుల చాంధాసవాదుల చేతుల్లో చిక్కి యువకుడు నరకయాతన అనుభవించాడు. సభ్య సమాజాం తలదించుకునేలా కులజాడ్యం మత్తులో కూరుకుపోయిన పెద్దోళ్ల అగ్రహాన్ని చవిచూశాడు ఆ యువకుడు. అయితే ఇదే సందర్భంలో సదరు యువకుడు తనపై మళ్లీ మళ్లీ అత్యాచారం చేశాడని ఓ మైనర్ బాలిక పోలీసులకు పిర్యాదు చేసింది. మహారాష్ట్ర, అహ్మద్ నగర్ లో చోటుచేసుకున్న ఈ ఘటన పూర్తి వివరాలు ఇలా వున్నాయి.
అహ్మద్ నగర్ పరిధిలోని వాంబోరి గ్రామానికి చెందిన ఓ మైనర్ బాలికపై పదే పదే అత్యాచారం చేయడంతో పాటు తనకు లోంగకపోతే అమెతో అత్యాచార దృశ్యాలను అందరికి పోస్టు చేస్తానని బెదిరించి లోంగదీసుకున్నాడని మైనర్ బాలిక పోలీసులకు పిర్యాదు చేసింది. అయితే బాలిక పిర్యాదు మేరకు బాలికల అత్యాచార నియంత్రం చట్టం కింద కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తును చేస్తున్నామని, బిన్గర్ క్యాంప్ పోలీసులు చెప్పారు. ఇదిలా వుండగా, రెండు రోజుల తరువాత నేరాభియోగం మోపబడిన యువకుడిని గ్రామ పెద్దలు నగ్నంగా గాడిదపైన ఊరేగించారు అది చాలదన్నట్లు మెడలో చెప్పుల దండను వేశారు. అంతటితో అగకుండా యువకుడి కుటింబికులను సైతం చితకబాదారు.
అయితే ఇతర కులస్థుడైన యువకుడు తమ కులానికి చెందిన యువతిలో ప్రేమకలాపం నడపడం గిట్టని గ్రామస్థులు ఈ దారుణానికి పాల్పడ్డారని తెలుస్తోంది. మైనర్ బాలిక, అమె కుటింబికులను కూడా బెదిరించి తప్పుడు పిర్యాదు పోలీస్ స్టేషన్ లో ఇప్పించారని సమాచారం. కాగా ఈ ఘటనపై స్పందించిన పోలీసులు యువకుడిని శిక్షించిన ఘటనకు సంబంధించి 17 మందిని అదుపులోకి తీసుకున్నారు. మరికోందరు పెద్దలు పరారీలో వున్నట్లు బిన్గర్ క్యాంప్ పోలిస్ స్టేషన్ సిఐ గర్ గాంగుర్డీ తెలిపారు.
జి. మనోహర్
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more