దేశ రాజధాని ఢిల్లీ నుంచి బయల్దేరిన ఎయిరిండియా విమానానికి తృటిలో పెద్ద ప్రమాదం తప్పింది. అందులో ప్రయాణిస్తున్న ప్రయాణికులు ఎయిర్ పోర్టు వచ్చేసింది కదా అని నడుముకు వున్న బెల్టులు తీసేసి చేతి లగేజిని తీసుకునేందుక ప్రయత్నిస్తున్నారు. అంతలో ఉన్నట్టుండి ఒక పెద్ద శబ్దం.. ప్రయాణికులందరూ హాహాకారాలు చేస్తూ వారి సీట్లలో వారు కూర్చున్నారు. అయితే కిటీకీల పక్కనున్న వారు మాత్రం అయ్యే విమానం రన్ వే పై నుంచి కాకుండా ఎక్కడికో వెళ్తోందంటూ అరుపులు పెట్టారు.
ఇంతలో బ్రేకులు పడ్డాయి. అంతే ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు. తాము సజీవంగా వున్నందుకు ముందుగా దేవుడికి ధన్యవాదాలు తెలపుకున్నారు. ఆ తరువాత జరిగిన విషయం తెలుసుకుని తృటిలో ప్రాణాపాయం తప్పిందంటూ వారికి వారే సముదాయించుకున్నారు.. ఢిల్లీ నుంచి కేరళలోని కొచ్చికి బయల్దేరిన ఎయిరిండియా విమానం సరిగ్గా ల్యాండ్ అవుతోందనగా.. దాని టైరు పేలిపోయింది. అందులో 161 మంది ప్రయాణికులు, 12 మంది సిబ్బంది ఉన్నారు. అయితే వాళ్లంతా సురక్షితంగా కిందకు దిగగలిగారు.
ఉదయం 9.10 గంటలకు విమానం దిగే సమయానికి అక్కడంతా మంచు దట్టంగా అలముకుని ఉంది. వెనకవైపు ఉన్న టైరు పేలిపోయింది. అయినా పైలట్ విమానాన్ని సురక్షితంగా కిందకు దించగలిగారు. బెంగళూరు నుంచి సాంకేతిక నిపుణులు వచ్చి విమానాన్ని పరిశీలించారు. ఈ కారణంగా ఉదయం 10.20 గంటలకు 138 మంది ప్రయాణికులతో షార్జా వెళ్లాల్సిన ఆ విమానం బాగా ఆలస్యంగా బయల్దేరాల్సి వచ్చింది. అయితే విమానం బయలుదేరే ముందు అంతా సవ్యంగా వుందా లేదా అని పరిశీలించాల్సిన సాంకేతిక బృందం పూర్తైన తరువాత కూడా టైరు ఎలా బస్ట్ అయ్యిందని ఎయిర్ ఇండియా అధికారులు విచారణ చేపట్టారు.
జి మనోహర్
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more