పోలీసులు ఎలా వ్యవహరిస్తారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తన, మన అనే భేదాభిప్రాయాలు అసలుండదని మామూలుగా అనుకుంటారు. ఇదే విషయాలను నిజం చేశారు మాల్దీవ్స్ కు చెందిన పోలీసులు. మాల్దీవుల మాజీ అధ్యక్షుడు మొహమ్మద్ నషీద్ క్రిమినల్ కోర్టు ఎదుట విలేకరులతో మాట్లాడే సమయంలో పోలీసులు కర్కశంగా ప్రవర్తించారు. జర్నలిస్టులతో మాట్లాడకుండా అతనిని ఈడ్చుకు పోయారు. 2012లో అతను అధికారంలో ఉన్న సమయంలో యాంటీ టెర్రరిజంలాను చట్టవిరుద్ధంగా ఉపయోగించారని అతని పైన ఆరోపణలు ఉన్నాయి. ఈ కేసుకు సంబంధించి లాయర్లను నియమించుకోవాలని కోర్టు అతనికి మూడు రోజుల సమయం ఇచ్చింది. ఈ నేపథ్యంలో సోమవారం కోర్టుకు తీసుకు వచ్చిన అతను జర్నలిస్టులతో మాట్లాడుతుండగా.. పోలీసులు అడ్డుకొని ఈడ్చుకెళ్లారు. అతనికి కోర్టు బెయిల్ నిరాకరించింది.
ఈ ఘటనలో అతనికి చేతి ఎముక విరిగింది. మరోవైపు, అతనిని వ్యక్తిగత లాయరును కలవనీయలేదు. విచారణ పూర్తయ్యే వరకు పోలీసు కస్టడీలోనే ఉంచాలని ఆదేశించారు. ఈ మొత్తం ఘటన పైన అంతర్జాతీయ సమాజం దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. చొక్కా పట్టి లాక్కొచ్చిన పోలీసులు.. తనకు గాయాలు అయితే కనీసం వైద్యుడి వద్దకు కూడా తీసుకు పోలేదని నషీద్ కోర్టులో జడ్జి ముందు చెప్పారు. తన చేయి విరిగిందని చెప్పాడు. అయితే, జడ్జి అతని విజ్ఞప్తిని వినిపించుకోకుండా ప్రొసీడింగ్స్ సాగించారని సమాచారం. అతను దేశం విడిచి పారిపోతాడని భావించి పోలీసులు ముందస్తుగా అరెస్టు చేసినట్లుగా తెలుస్తోంది. మాజీ నేత నషీద్ అరెస్టును మాల్దీవుల ప్రభుత్వం సమర్థించింది. కాగా, మొహమ్మద్ నషీద్ను పోలీసులు ఈడ్చుకెళ్లడం పైన భారత్ స్పందించింది. నషీద్ పైన పోలీసుల దాడి దురదృష్టకరమని, నిష్పక్షపాత విచారణ జరగాలని ప్రధాని మోడీ అన్నారు.
- అభినవచారి
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more