దుబాయ్లో అత్యంత ఎత్తైన నివాసాల సముదాంలో ఇవాళ భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ప్రపంచంలోనే ఎత్తైన భవన ఆకాశహర్మ్యంలో ఒకటైన 'టార్చ్' టవర్లో ఈరోజు తెల్లవారుజామున ఈ సంఘటన చోటుచేసుకుంది. భవన సముదాయంలోని 59వ అంతస్తులో మంటలు చెలరేగినట్లు తెలుస్తోంది. ప్రమాదం జరిగినప్పుడు వేలాదిమంది ఉండగా, అప్రమత్తమైన పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది అక్కడకు చేరుకుని వారిని వందలాది కుటుంబాలను ముందస్తు జాగ్రత్త చర్యల్లో భాగంగా సురక్షితంగా బయటకు తరలించినట్లు సమాచారం. పెద్ద ఎత్తున ఎగసిపడుతున్న మంటలను అగ్నిమాపక సిబ్బంది అదుపు చేసేందుకు యత్నిస్తున్నారు.
బిల్డింగ్ మధ్య భాగంలో అగ్నిప్రమాదం జరగటంతో భవన సముదాయంలో చిక్కుకున్నవారు కొంతమంది మెట్ల ద్వారా కిందకు రాగా, మరికొందరు బిల్డింగ్ పైకి చేరుకున్నారు. చిక్కుకున్నవారిని సురక్షితంగా బయటకు తరలించేందుకు పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది యత్నిస్తున్నారు. అయితే ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని అధికారులు చెబుతున్నారు. ఘటనా స్థలానికి చేరకున్న సుమారు 12 పైగా అగ్రిమాపక దళాలు మంటలను అదుపుచేసేందుకు యత్నిస్తున్నాయని చెప్పారు. అర్థరాత్రి రెండు గంటల సమయంలో అకస్మాత్తుగా మంటలు వ్యాపించడంతో అగ్నిప్రమాదం సంభవించిందని స్థానికులు చెబుతున్నారు.
కాగా అగ్నిప్రమాదానికి గల కారణాలను వివరించేందుకు సంబంధిత అధికారులు నిరాకరించారు. అయితే ప్రమదాంలో ఎలాంటి ప్రాణనష్టం కానీ, క్షతగాత్రులు కానీ లేరని అక్కడి వైద్యాధికారులు చెబుతున్నారు. అగ్నిప్రమాదం నేపథ్యంలో ఈ బహుళ అంతస్థు భవనానికి పక్కనే వున్న మరో రెండు భవనాలలోని కుటుంబాలను కూడా అధికారులు ముందస్తు జాగ్రత్త చర్యగా ఖాళీ చేయించారని సమాచారం. మరోవైపు బయటకు వచ్చేందుకు అందరూ ఒక్కసారిగా మెట్లమార్గాన్ని ఆశ్రయించటంతో తొక్కిసలాట జరగి పలువురు గాయపడినట్లు తెలుస్తోంది. 60వ అంతస్తు పూర్తిగా అగ్నికి ఆహుతి అయ్యింది. కోట్లలో ఆస్తినష్టం జరిగినట్లు అధికారుల అంచనా. కాగా ప్రమాదానికి గల కారణాలు తెలియరాలేదు.
జి మనోహర్
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more