మీ పాదానికి ముళ్లు గుచ్చుకుంటే.. నా పంటితో తీస్తాను ఈ డైలాగ్ ఎవరన్నారు.. ఎక్కడన్నారు.. ఎప్పుడన్నారు అని అడిగితే తెలుగు రాష్ట్ర ప్రజలకు చట్టుకున గుర్తుకువచ్చేది ఒకరి పేరే. అయనే తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట చంద్రశేఖర్ రావు. అనేక సందర్భాల్లో ఈ డైలాగ్ ను ఆయన వాడారు. తొలిసారిగా కరీంనగర్ లో తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ అవిర్భావం సందర్భంగా తెలంగాణ ప్రజలను ఉద్దేశించి ఆయన వాడిన డైలాగ్ ఇది. ఈ డైలాగ్ తో ఆయన ఎప్పటికీ తెలంగాణ ప్రజల మదిలో చిరస్థాయిగా వుంటారు. ఇలా అనుకునే తెలంగాణవాసులకు ఆయన షాక్ ఇచ్చారు.
ఉద్యమం సాగినప్పుడల్లా తెరమీదరకు వచ్చి ఈ డైలాగ్ ను వల్లెవేసిన కేసీఆర్ ముఖ్యమంత్రి కాగానే.. మాట మార్చారు. డైలాగ్ అదే కానీ.. పక్షమే వేరంటున్నారు. ఇన్నాళ్లు తెలంగాణ పక్షాణ నిలిచిన ఆయన ఇప్పుడు కోత్తగా సీమాంధ్రల పక్షాన నిలిచారు. సీమాంధ్రులపై ఆయన ప్రేమ కురిపించారు. సీమాంధ్రుల ఆదరాప్యాయతలను గెలుచుకునేందుకు కొంత శ్రమిస్తున్నారు. కూకట్ పల్లి కేపీహెచ్.బిలో జరిగిన ఓ సమావేశంలో ఆయన సీమాంధ్రులనుద్దేశించి తెలంగాణలో నివసించే వారందరూ తెలంగాణ వాసులేనన్నారు. మీ పాదాలకు ముళ్లు దిగితే తన పంటితో తీస్తానని భరోసా కల్పించారు. సుమారు వెయి మంది వివిధ పార్టీలకు చెందిన కార్యకర్తలు, పార్టీ శ్రేణులు టీఆర్ఎస్ పార్టీ తీర్ధం పుచ్చుకున్న కార్యక్రమానికి ఆయన హాజరై ప్రసంగించారు. ఈ సందర్భంగా సీమాంధ్రులపై ఆయన ప్రత్యేక ప్రేమ కనబర్చారు.
అయితే త్వరలో రానున్న గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలలో భాగంగానే ఆయన ప్రేమ కనబరుస్తున్నారని విమర్శలు కూడా లేకపోలేదు. గ్రేటర్ పరిధిలో అధక సంఖ్యలో వున్న సీమాంధ్రుల ఓట్లను పొంది గ్రేటర్ పై కూడా గులాబి జెండాను అవిష్కరింపజేయాలన్న కాంక్షతోనే ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ డైలాగ్ వాడుతున్నారని పలువురు అంటున్నారు. ఇప్పటికే గ్రేటర్ పరిధిలోని అధిక అసెంబ్లీ స్థానాలను టీడీపీ కైవసం చేసుకోవడంతో.. వారిని అన్ని రకాలుగా దగ్గర చేసుకుని గ్రేటర్ ఎన్నికలలో విజయాన్ని ఆస్వాధించాలని కేసీఆర్ ప్రయత్నిస్తున్నారు. మరి కేసీఆర్ ప్రయత్నాలు ఎంత మేరకు ఫలితాన్నిస్తాయో వేచి చూడాల్సిందే
జి మనోహర్
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more